News October 8, 2025

కాకరేపుతోన్న ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాలు

image

ప్రస్తుత రాజకీయాలు ఉమ్మడి జిల్లా చుట్టూనే తిరుగుతున్నాయి. ములకలచెరువులో దొరికిన అక్రమ మద్యం, పరివట్టం వివాదం, దేవళంపేటలో అంబేడ్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన అంశాలు జిల్లాలో తీవ్ర దుమారం రేపాయి. అధికార, విపక్షాల మాటలతో జిల్లాలో రాజకీయాలు కాకరేపాయి. చంద్రబాబు, పెద్దిరెడ్డి వంటి కీలకనేతలు ప్రాతినిధ్యం వహించడం, ఆధ్యాత్మిక ప్రాంతం కావడంతో ఇక్కడ ఏం జరిగినా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారుతున్నాయి.

Similar News

News January 12, 2026

అన్నమయ్య జిల్లాలో పొంచి ఉన్న ప్రమాదం

image

జిల్లాలోని భూగర్భ జలాల్లో యురేనియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగినట్లు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ (CGWB) 2025 నివేదిక వెల్లడించింది. గాలివీడు, బోరెడ్డిగారిపల్లి, బసిని కొండ, చిన్నమండ్యం, సానిపాయ్, చింతపర్తి గ్రామాల్లో యురేనియం సాంద్రత 30 PPB కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఈ పరిస్థితి తాగునీరు, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News January 12, 2026

భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓ దమ్మపేట: కారు ఢీకొని మహిళ మృతి
✓ పాల్వంచ: గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్
✓ కొత్తగూడెం కార్పొరేషన్ ఓటరు జాబితా విడుదల
✓ భద్రాద్రి డీసీసీ అధ్యక్షురాలిగా దేవి ప్రసన్న ప్రమాణం
✓ కొత్తగూడెం: పెండింగ్ వేతనాలు చెల్లించాలి: ఐఎఫ్టీయూ
✓ కొత్తగూడెం బీఆర్ఎస్‌లో వర్గాలు లేవు: ఎంపీ వద్దిరాజు
✓ జిల్లా వ్యాప్తంగా వివేకానంద జయంతి వేడుకలు

News January 12, 2026

వరంగల్: స్వాతంత్ర్య సమరయోధురాలు కన్నుమూత

image

వరంగల్ పరిధి గిర్మాజిపేటకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు దివంగత వన్నాల పెద్ద వీరన్న సతీమణి, స్వాతంత్ర్య సమరయోధురాలు వన్నాల లక్ష్మి ముదిరాజ్ (100) అనారోగ్యంతో సోమవారం కన్నుమూశారు. ఆమెకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమె దేశం కోసం చేసిన పోరాటం, దేశభక్తి స్ఫూర్తి, సేవా విలువలను కుటుంబ సభ్యులు, స్థానికులు గుర్తు చేస్తున్నారు. అభిమానులు, పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు.