News August 7, 2024

కాకినాడ అబ్బాయిని మోసం చేసిన ఆరుగురు మహిళలు

image

కాకినాడకు చెందిన కృష్ణమోహన్‌కు పెళ్లిసంబంధం చూస్తానని శిరీష అనే మహిళ కలిసింది. జూన్ 23న సత్యవేణి, దుర్గ అనే ఇద్దరిని పరిచయం చేసింది. వారు అతణ్ని రాజమండ్రికి తీసుకెళ్లి నీరజను పెళ్లికుమార్తెగా చూపించారు. నచ్చడంతో నిశ్చితార్థం ఖర్చులకు రూ.2.80లక్షలు, గోల్డ్ చైన్, ఫోన్‌ను సత్యదేవి, ప్రియాదేవికి అందించాడు. కొద్దిరోజులకు అనుమానంతో ప్రశ్నించగా మోసం చేశారని తేలింది. పోలీసులకు ఫిర్యాదుచేయగా కేసు నమోదైంది.

Similar News

News December 15, 2025

తూ.గో: పాత నేరస్థుల ఇళ్లపై పోలీసుల నిఘా

image

తూ.గో జిల్లాలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా టీములుగా ఏర్పడి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు తెలిపారు. దీనిలో భాగంగా 68 నంబర్, రికార్డు లేని ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశామని తెలిపారు. 30 మంది పాత నేరస్థుల ఇళ్లను తనిఖీ చేశామన్నారు.

News December 15, 2025

తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.

News December 15, 2025

తూ.గో: ఒక రోజు ముందే పెన్షన్ పంపిణీ

image

పెన్షన్ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. నూతన సంవత్సరంలో ఇవ్వాల్సిన పెన్షన్‌ను డిసెంబర్ 31వ తేదీ ఉదయం 7 గంటల నుంచే పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కార్యాలయం నుంచి ఆదివారం ప్రకటన వెలువడింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే పెన్షన్‌ను అందజేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు.