News December 1, 2025
కాకినాడ అభివృద్ధి కోసం గళమెత్తండి MP సారూ..!

కాకినాడ జిల్లా అభివృద్ధికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పోర్ట్ విస్తరణ, కోటిపల్లి-నర్సాపురం రైల్వే, గ్రీన్ఫీల్డ్ హైవే, ఉప్పాడ తీర రక్షణ, అమృత్ జల జీవన్ నిధుల విడుదల అత్యవసరమని ప్రజలు అంటున్నారు. కాకినాడ ఇండస్ట్రియల్ కారిడార్, ఆయిల్ గ్యాస్ ప్రాజెక్టుల విస్తరణ వంటి సమస్యలపై ఎంపీలు ఉదయ్, సతీష్ పార్లమెంట్లో గళమెత్తాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News February 18, 2026
NZB: పసుపు రైతు అభివృద్ధే దేశాభివృద్ధి: పసుపు బోర్డు ఛైర్మన్

పసుపు రైతుల అభివృద్ధే దేశాభివృద్ధి అని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో టర్మరిక్ బోర్డు మీటింగ్లో ఆయన పాల్గొన్నారు. దేశంలోని పసుపు రైతుల సంక్షేమం, ఎగుమతుల విస్తరణ, అంతర్జాతీయ మార్కెట్లో భారత పసుపు బ్రాండ్ బలోపేతం వంటి అంశాలపై చర్చించినట్లు ఆయన తెలిపారు. పసుపు రైతుల భవిష్యత్తు బలోపేతం కావాలంటే ప్రభుత్వ, రైతు, వ్యాపార వర్గాల సమన్వయం అత్యవసరమని అన్నారు.
News February 18, 2026
జగిత్యాల: ‘ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలి’

విద్యార్థులు ఉపాధి కల్పన కార్డుకు నమోదు చేసుకోవాలని జిల్లా ఉపాధి కల్పన అధికారి సత్యమ్మ పేర్కొన్నారు. జగిత్యాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో కెరీర్ గైడెన్స్, ఉపాధి కల్పన కార్డు నమోదు కార్యక్రమంపై బుధవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. సిబ్బంది లైన కుమారి, ప్రసన్న, సదానందం లు రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యార్థులకు చూపించారు.
News February 18, 2026
ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే భూముల్ని వెనక్కి తీసుకోండి: CBN

AP: GOVT ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ఏర్పాటవ్వాలని సీఎం CBN SIPB భేటీలో అధికారులను ఆదేశించారు. ‘గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, BPCL వంటి మెగా ప్రాజెక్టులు ఏర్పాటు కావాలి. భూముల కేటాయింపులపైన ఇతరులతో మాట్లాడాలి. ప్రాజెక్టులు ఏర్పాటు చేయకుంటే ఆ భూముల్ని తీసుకోండి. సెమీ కండక్టర్ ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలిస్తాం’ అని చెప్పారు. కాగా ₹29,021 కోట్లతో 22,407 ఉద్యోగాలిచ్చే 27 ప్రాజెక్టులను ఆమోదించారు.


