News October 5, 2025

కాకినాడ: ప్రశాంతంగా ఏపీపీ రాత పరీక్ష

image

అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ) పోస్టుల నియామకానికి సంబంధించిన రాత పరీక్షలు ఆదివారం జేఎన్టీయూ కళాశాల కేంద్రంలో ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. పరీక్షకు మొత్తం 272 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 212 మంది మాత్రమే హాజరయ్యారని తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ వివరించారు.

Similar News

News January 24, 2026

భూపాలపల్లి జిల్లాను రద్దు చేయడం ఎవరి తరం కాదు: ఎమ్మెల్యే గండ్ర

image

భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారంటూ కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మండిపడ్డారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న భూపాలపల్లి జిల్లాను భూకంపం వస్తే తప్ప రద్దు చేయడం ఎవ్వరితరం కాదని అన్నారు. కొందరు సన్నాసులు సీఎం రేవంత్ రెడ్డిపై అబద్దాలను ప్రచారం చేస్తు మున్సిపల్ ఎన్నికల్లో గెలువాలని చూస్తున్నరని అన్నారు. దమ్ముంటే నిజాయితీగా కొట్లాడాలని సవాల్ విసిరారు.

News January 24, 2026

KNR: ఆర్టీసీకి 14 రోజుల్లో రూ.46.37 కోట్ల ఆదాయం

image

సంక్రాంతి పండుగ సందర్భంగా కరీంనగర్ రీజియన్ పరిధిలో ఆర్టీసీకి భారీ ఆదాయం సమకూరింది. ఈనెల 7 నుంచి 20వ తేదీల్లో మొత్తంగా 1528 అదనపు బస్సులు నడపగా.. 14 రోజుల్లో రూ.46.37 కోట్లు ఆదాయం వచ్చింది. ఇక కరీంనగర్ రీజియన్ పరిధిలో కరీంనగర్-2 డిపోలో రూ.7.78 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా మంథని డిపోలో రూ. 2.43 కోట్లతో చివరి స్థానంలో ఉంది.

News January 24, 2026

సిరిసిల్ల: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

image

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని, ఉన్నత స్థానాలకు ఎదగాలని ఇంఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని జిల్లా సంక్షేమ శాఖ ఆద్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించారు. ఈ మేరకు ఇంఛార్జ్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఫ్లెక్సిపై బాలికలను ఉద్దేశించి స్కై ఇస్ ద లిమిట్ అని రాశారు.