News November 19, 2025
కాకినాడ మీదుగా శ్రీలంక వెళ్లాలనుకున్న హిడ్మా?

AP: వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో దండకారణ్యం నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని మావోయిస్టు అగ్రనేత హిడ్మా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కొద్దిమంది అనుచరులతో కలిసి శ్రీలంకలో తలదాచుకోవాలని భావించాడని సమాచారం. కాకినాడ పోర్టు నుంచి సముద్రమార్గంలో వెళ్లేందుకు ప్లాన్ వేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ క్రమంలో దండకారణ్యం నుంచి బయటికొచ్చిన హిడ్మా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్లో చనిపోయాడని తెలుస్తోంది.
Similar News
News January 24, 2026
రాష్ట్రానికి శాశ్వత రాజధాని అమరావతి: CBN

AP: రాష్ట్రానికి అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని CM చంద్రబాబు చెప్పారు. ‘ప్రపంచం మెచ్చే రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలను ప్రక్షాళన చేశాం. చెడు ఆలోచనలతో నేరస్థులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో చూశాం. పద్ధతి లేని రాజకీయాలు ఎవరు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు’ అని నగరిలో నిర్వహించిన ప్రజావేదికలో పేర్కొన్నారు.
News January 24, 2026
KTRను నేరస్థుడిగా పరిగణించలేదు: జూపల్లి

TG: ఫోన్ ట్యాపింగ్ దుర్మార్గమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో దర్యాప్తు జరుగుతోందని, కేటీఆర్కు CRPC 160 కింద నోటీసులు ఇచ్చారని తెలిపారు. కేటీఆర్ను నేరస్థుడిగా పరిగణించలేదని, సాక్షిగా సమాచారం కోసమే విచారణకు పిలిచారని తెలిపారు. ప్రభుత్వానిది రాజకీయ కక్ష అనడం సరికాదని, కేసులో పాత్రధారులు, సూత్రధారులు తేలాలని పేర్కొన్నారు. దోషులకు కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు.
News January 24, 2026
కలెక్షన్స్లో ధురంధర్ను దాటేసిన బార్డర్-2

సన్నీ డియోల్ నటించిన ‘బార్డర్-2’ ఫస్ట్ డే ఇండియా(హిందీ) కలెక్షన్లలో ఆల్ టైమ్ హిట్ ‘ధురంధర్’ రికార్డును బ్రేక్ చేసింది. Sacnilk.com ప్రకారం.. ధురంధర్ మొదటి రోజు ₹27 కోట్లు (నెట్) వసూలు చేయగా, బార్డర్-2 ఏకంగా ₹30 కోట్లు రాబట్టి సత్తా చాటింది. అయితే ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లలో మాత్రం ధురంధర్ (₹41.5 కోట్లు) కంటే బార్డర్-2 (₹41 కోట్లు) స్వల్పంగా వెనుకబడి ఉంది.


