News May 7, 2025

కామారెడ్డి: ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి: షబ్బీర్ అలీ

image

పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పహల్గామ్‌లో పర్యటకుల బృందాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన భయంకరమైన ఉగ్రదాడిని ఖండిస్తున్నామని అన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిని బహిరంగంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Similar News

News February 7, 2026

మున్సిపల్ ఎన్నికల నగారా.. పటిష్ఠ నిఘా

image

ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. కలెక్టర్ అనుదీప్ జిల్లా ఎన్నికల అధికారిగా పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. ఎన్నికల కోడ్‌ను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, పారదర్శకంగా పోలింగ్ జరిగేలా క్షేత్రస్థాయి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

News February 7, 2026

నారాయణపేటలో ‘త్రిముఖ’ పోరు

image

నారాయణపేట మున్సిపల్ పీఠం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు వ్యూహప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. బీజేపీ గెలుపు కోసం కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మాజీ మంత్రులు రంగంలోకి దిగగా.. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి బృందం వార్డుల్లో విస్తృతంగా పర్యటిస్తోంది. ఇక బీఆర్ఎస్ బాధ్యతను మాజీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, యాదగిరి రెడ్డి భుజాన వేసుకున్నారు. అగ్రనేతల ప్రచారంతో పేటలో ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది.

News February 7, 2026

మండల స్థాయిలోనే ప్రజా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం‘ప్రజావాణి’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లా ప్రజలు ఇకపై కలెక్టరేట్‌కు రావాల్సిన అవసరం లేదన్నారు. సంబంధిత ఎంపీడీఓ కార్యాలయాల్లోని సమాచార సహాయక కేంద్రం (IFC) ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను సులభంగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలోనే వినతులను పరిష్కరించి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరుస్తామని ఆయన స్పష్టం చేశారు.