News May 7, 2025

కామారెడ్డి: ఉరేసుకొని వ్యక్తి మృతి

image

బాన్సువాడ మండలం బేతాళ స్వామి కాలనీకి చెందిన రాంపురం నారాయణ ఉరేసుకొని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నారాయణ తన కూతురికి 25 ఏళ్ల క్రితం ఇల్లరికం పెళ్లి చేశాడు. కొన్ని రోజులుగా మద్యానికి బానిసై ఇంట్లో గొడవపడి గురువారం రాత్రి బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం ఉరేసుకోగా కూతురు విజయ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Similar News

News February 16, 2026

కరీంనగర్ బల్దియాలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గం

image

కరీంనగర్ నగరపాలక సంస్థ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం, మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికకు సర్వం సిద్ధమైంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు ప్రమాణ స్వీకారం, మధ్యాహ్నం 12:30 గంటలకు పరోక్ష ఎన్నిక నిర్వహించనున్నట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎన్నికల దృష్ట్యా సోమవారం మధ్యాహ్నం వరకు పౌర సేవలను నిలిపివేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షిస్తామని, కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

News February 16, 2026

UPI ట్రాన్సాక్షన్ రూ.1000 దాటితే ఫీజులా?

image

దేశంలో UPI వినియోగం పెరగడంతో రోజూ లక్షల సంఖ్యలో లావాదేవీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రూ.1000 కంటే ఎక్కువ మొత్తం UPI ద్వారా చెల్లిస్తే సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తారంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. దీనిపై NPCI స్పందించింది. వ్యక్తుల మధ్య, వ్యక్తులు-వ్యాపారుల మధ్య జరిగే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలను వసూలు చేయడం లేదని తెలిపింది. ఇలాంటి వార్తలను నమ్మొద్దని కోరింది.

News February 16, 2026

పాకిస్థాన్‌పై గెలుపు.. ఇండియా సరికొత్త రికార్డు!

image

T20 WCలో పాకిస్థాన్‌పై టీమ్ ఇండియా <<19153355>>అద్భుత విజయం<<>> సాధించిన విషయం తెలిసిందే. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక సార్లు గెలిచిన టీమ్‌గా రికార్డు సృష్టించింది. పాక్‌తో జరిగిన 9 మ్యాచుల్లో ఏకంగా 8 సార్లు భారత్ గెలిచింది. మరే జట్టూ దరిదాపుల్లో కూడా లేదు. బంగ్లాపై ఆస్ట్రేలియా, బంగ్లాపై పాకిస్థాన్, వెస్టిండీస్‌పై శ్రీలంక, ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ 6 విజయాలతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.