News August 12, 2025
కామారెడ్డి: ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంది: కాంగ్రెస్

దేశంలో ఎన్నికల కమిషన్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ బీజేపీ కోసం పని చేస్తుందన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దేశ ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించారన్నారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని కోరారు.
Similar News
News March 9, 2026
చమురు భగభగ.. 120 డాలర్లకు చేరిన బ్యారెల్!

మిడిల్ ఈస్ట్లో టెన్షన్స్తో క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులో 29% పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో 2022లో చివరగా ఈ రేంజ్ హైక్ నమోదైంది. UAE ముర్బాన్ క్రూడ్ బ్యారెల్ (159L) ధర $120కు, వెస్ట్ టెక్సాస్ $115, బ్రెంట్ క్రూడ్ $116కు చేరాయి. ఇరాక్, కువైట్, UAEలో చమురు ఉత్పత్తి తగ్గడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాక్లో రోజుకు 4.3M బ్యారెల్స్గా ఉండే ఉత్పత్తి 1.8 మిలియన్లకు పడిపోయింది.
News March 9, 2026
పి.గన్నవరం: గోదావరిలో దూకి మహిళ ఆత్మహత్యాయత్నం

యానాం–ఎదురులంక వంతెనపై సోమవారం ఉదయం ఓ మహిళ గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, అదే సమయంలో నదిలో చేపల వేట సాగిస్తున్న జాలర్లు ఆమె కేకలు విని అప్రమత్తమయ్యారు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఆమెను చాకచక్యంగా కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక ప్రాణాన్ని నిలిపిన జాలర్లను స్థానికులు అభినందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 9, 2026
HYD: 20 కిలోల టమాట రూ.60.. రైతుల ఆవేదన!

HYDలో టమాట ధరలు రోజు రోజుకు పడిపోతున్నాయి. బోయిన్పల్లి మార్కెట్లో గత 3, 4 రోజులుగా టమాట ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం 20 కిలోల టమాట క్రేట్ ధర కేవలం రూ.60 నుంచి రూ.150 మధ్య మాత్రమే పలుకుతోంది. సరఫరా ఎక్కువగా రావడం, వివాహాది శుభకార్యాలు ఇంకా మొదలవ్వకపోవడంతో వినియోగం తగ్గి ధరలు పడిపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


