News January 20, 2026

కామారెడ్డి: పదో తరగతి విద్యార్థినులకు ఇస్రో సందర్శన భాగ్యం

image

కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రోత్సాహంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పదో తరగతి విద్యార్థినులకు ISROను సందర్శించే అవకాశం లభించింది. గత అక్టోబర్ నెలలో నిర్వహించిన ప్రతిభా పరీక్ష ద్వారా ఎంపికైన 50 మంది విద్యార్థినులు, వారితో పాటు 30 మంది ఉపాధ్యాయులు ఈనెల 29 ఇస్రో సందర్శనకు వెళ్లనున్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితాను కలెక్టరేట్ కార్యాలయం సోమవారం విడుదల చేసింది.

Similar News

News February 14, 2026

సిద్దిపేట: జాగ్రత్త.. బుట్టలో వేసి.. లక్షలు దోచేస్తున్నారు!

image

మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు హెచ్చరించారు. ప్రధానంగా NRI, పెద్ద వ్యాపారవేత్తలమని నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారని తెలిపారు. పరిచయం పెంచుకున్నాక అత్యవసరాలు, స్టాక్స్, ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ పెట్టుబడుల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని వివరించారు.

News February 14, 2026

రావులపాలెంలో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

రావులపాలెం సమీపాన అమలాపురం రోడ్డులో బెంగళూరు అయ్యంగార్ బేకరీ వద్ద శుక్రవారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తులను వెనక వస్తున్న ట్రాలీ లారీ ఢీకొంది. చోదకుడు అనిల్ రెడ్డి(19) ఘటన స్థలంలోనే మృతి చెందగా..బైక్‌పై కూర్చున్న లోకేశ్వర సూర్య రాజు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సూర్య ఫిర్యాదు మేరకు ASI శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు.

News February 14, 2026

కాగజ్‌నగర్‌లో ఓటర్ల విలక్షణ తీర్పు..!

image

కాగజ్‌నగర్ బల్దియా ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. ఇక్కడ పోటీ చేసిన 3 ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కదానికి మ్యాజిక్ ఫిగర్ ఫలితాలు ఇవ్వలేదు. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 9, BRS 11, BJP 05, AI MIM 01, ఇండిపెండెంట్ లు 03 గెలిచారు.