News January 12, 2025
కార్పొరేషన్పై కాషాయి జెండా ఎగురవేయడమే మా లక్ష్యం: ఎంపీ అరవింద్
బీజేపీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన వారికీ హైదరాబాద్లోని ఎంపీ అరవింద్ నివాసంలో శనివారం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అధ్యక్షతన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నియామక పత్రాలు అందజేశారు. నూతనంగా నియమితులైన మండల అధ్యక్షులు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు. కార్పొరేషన్పై జెండా ఎగరవేయడమే లక్ష్యమని ఎంపీ అరవింద్ అన్నారు.
Similar News
News January 16, 2025
బాన్సువాడ: అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్ష సమావేశం
బాన్సువాడ ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి తహాసిల్దార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
News January 16, 2025
NZB: క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరపండి: కలెక్టర్
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన జరిపి గ్రామ సభల ద్వారా అర్హులైన లబ్ధిదారుల జాబితాను రూపొందించాలని నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఈ నెల 26 నుంచి రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
News January 16, 2025
NZB: పోలీసుల పేర్లు పింక్ బుక్లో ఎక్కిస్తున్నాం: జీవన్ రెడ్డి
కాంగ్రెస్ కొమ్ము గాస్తున్నా పోలీసుల పేర్లు పింక్ బుక్లో ఎక్కిస్తున్నామని ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హోం మంత్రిత్వశాఖను కూడా నిర్వ హిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వరెస్ట్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి అరెస్టుల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బందాలా..? అని ఆయన మండిపడ్డారు.