News March 12, 2025
కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలి: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. ప్రతి మూడో శనివారం చేపడుతున్న స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలపై చర్చించారు. నిర్వహణపై బుధవారం ఉదయం తన ఛాంబర్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Similar News
News February 16, 2026
విశాఖలో శాప్ లీగ్ క్రీడా పోటీల పోస్టర్ విడుదల

విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ‘శాప్ లీగ్’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ లీగ్లో భాగంగా ఈనెల 17న గోపాలపట్నం ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి చదరంగం (Chess) పోటీలు, 24న మర్రిపాలెంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.
News February 16, 2026
ఈ నెల 18న విశాఖకు ముఖ్యమంత్రి రాక

విశాఖ కేంద్రంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ కార్యక్రమంలో పాల్గొడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఈనెల 18న విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేవల్ జెట్టికి చేరుకొని భారత రాష్ట్రపతికి స్వాగత కార్యక్రమం అనంతరం ఐఎఫ్ఆర్లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం గం.1:20 నిమిషాలకు విశాఖపట్నం ఐఎన్ఎస్ డేగా నుంచి బయలుదేరి ఉండవల్లి వెళ్తారు.
News February 16, 2026
సాంయంత్రం 6 దాటాకే ఆర్కే బీచ్కు అనుమతి..

విశాఖ బీచ్ రోడ్డులో ఈనెల 16, 17 తేదీల్లో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ICP-2026 ప్రాక్టీస్ పరేడ్ జరగనుంది. ఈ సమయంలో సముద్రం వైపు ఉన్న సగం రోడ్డును నేవీకి కేటాయించారు. ఎన్టీఆర్ సర్కిల్, పార్క్ హోటల్ జంక్షన్ల వద్ద వాహనాలను దారి మళ్లిస్తారు. సందర్శకులు సాయంత్రం 6 గంటల తర్వాతే బీచ్కు రావాలని పోలీసులు కోరారు.


