News March 13, 2025
కుబీర్: భార్య కాపురానికి రావడం లేదని సూసైడ్

భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలం మర్లకొండాకు చెందిన కృష్ణ ADBలో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై భార్య సంగీతను వేధించాడు. దీంతో ఆమె ఇంద్రవెల్లి మండలం శంకర్గూడకు వచ్చి ఉంటున్నారు. ఈనెల 2న కృష్ణ మద్యం తాగి భార్యతో గొడవపడి సూసైడ్ చేసుకున్నారు.
Similar News
News February 12, 2026
గురుకులాల్లో ప్రవేశాలు.. దరఖాస్తుకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?

అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గురుకుల విద్యాలయాలలో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతి నుండి జూనియర్ ఇంటర్ వరకు నూతన ప్రవేశాలకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని ఉమ్మడి తూ.గో జిల్లా సమన్వయ అధికారి రాజకుమారి సూచించారు. 6 నుండి 10 తరగతిల వరకు ఉన్న ఖాళీలకు బాలురు బాలికల నుండి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆమె తెలిపారు. https://apgpcet.apcffss.in ఆన్లైన్లో ఈనెల 19 లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు
News February 12, 2026
జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని తనిఖీ చేసిన జేడీ

భూపాలపల్లి జిల్లా కోశాధికారి కార్యాలయాన్ని డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్ వి.నాగరాజు గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జరుగుతున్న బిల్లుల ఆన్లైన్ ప్రాసెసింగ్ విధానం, పెండింగ్ బిల్లుల స్థితి, జీతభత్యాల చెల్లింపులు, పెన్షన్ కేసుల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించారు. ప్రభుత్వ నిధుల వినియోగం పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరగాలని సూచించారు.
News February 12, 2026
నిజామాబాద్ జిల్లాలో క్యాంప్ రాజకీయాలు

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. గెలిచిన అభ్యర్థులు చేజారకుండా బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. బీజేపీ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే సూర్యనారాయణ, బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా ఆధ్వర్యంలో అభ్యర్థులను తరలించేందుకు ప్రైవేట్ బస్సులు సిద్ధం చేసినట్లు సమాచారం.


