News November 6, 2025

కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం

image

గడచిన 24 గంటలలో నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా నమోదైన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ అధికారులు గురువారం ప్రకటించారు. నాగర్‌కర్నూల్ మండలంలోని కుమ్మెరలో 42.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. పాలెంలో 33.5, లింగాలలో 22.5, కల్వకుర్తిలో 15.5, బిజినేపల్లిలో 15.0, కొండనాగులలో 13.8, పెద్దముద్దునూరులో 10.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు పేర్కొన్నారు.

Similar News

News January 18, 2026

వనపర్తి: పుర ఎన్నికల ఆశావహుల్లో నైరాశ్యం

image

పుర ఎన్నికల రిజర్వేషన్ల మార్పుతో ఆశావహుల ఆశలు అడియాసలయ్యాయి. గత రిజర్వేషన్లు తారుమారు కావడంతో పతులు తమ సతుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నేతలు తమ సతీమణులను పోటీకి దించేందుకు సిద్ధపడగా, మరికొందరు అనుచరులతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అభ్యర్థులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.

News January 18, 2026

జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కమిషన్

image

TG: రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు రిటైర్డ్‌ జడ్జితో కమిషన్‌ వేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. మేడారంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 18 అంశాలపై చర్చించారు. పొట్లాపూర్ ఎత్తిపోతల పథకానికి, మేడారంలో శాశ్వత భవనాల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

News January 18, 2026

ముగిసిన సెలవులు.. గుంటూరు నుంచి ప్రత్యేక రైళ్లు

image

సంక్రాంతి సెలవులు ముగియడంతో గుంటూరులో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రధాన నగరాలకు వెళ్లే బస్సు, రైలు టికెట్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోవడంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. గుంటూరు నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై నగరాలకు ఈ స్పెషల్ రైళ్లు నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.