News October 6, 2025
కురుపాం గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి

కురుపాం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెంనాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసర ప్రాంతాలు, డైనింగ్ హాలు, కిచెన్ షెడ్, మరుగుదొడ్లను క్షుణంగా పరిశీలించారు. అనంతరం ఇద్దరు విద్యార్థులు మృతికి మిగతా విద్యార్థులు అనారోగ్యం బారిన పడడానికి గల కారణాలను పాఠశాల సిబ్బందికి అడిగి తెలుసుకున్నారు.
Similar News
News January 20, 2026
రేషన్ కార్డు ప్రామాణికంగా ఇందిరమ్మ చీరల పంపిణీ: కలెక్టర్

మహిళా సంఘాల్లో సభ్యులుగా లేని మహిళలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పురపాలక సంఘాల్లో మహిళలకు వడ్డీలేని రుణాలు, చీరల పంపిణీపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి చీరల పంపిణీని 3 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.
News January 20, 2026
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు త్వరగా పూర్తి చేయాలి: డిప్యూటీ సీఎం

మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సంఘాల్లో లేని వారిని రేషన్ కార్డు ఆధారంగా గుర్తించి, పంపిణీలో రద్దీ లేకుండా చూడాలని సూచించారు. మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావులతో కలిసి కలెక్టర్లు, బ్యాంకు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొన్నారు.
News January 20, 2026
కరూర్ తొక్కిసలాట.. నిందితుడిగా విజయ్ పేరు?

కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి CBI <<18898953>>విచారణకు<<>> నిన్న రెండోసారి విజయ్ హాజరైన విషయం తెలిసిందే. త్వరలో ఆయన్ను నిందితుడిగా చేర్చనున్నట్లు తెలుస్తోంది. ఏడీజీపీ, మరో పోలీసు అధికారిపైనా అభియోగాలు మోపే అవకాశం ఉందని సమాచారం. ఫిబ్రవరి రెండో వారంలో CBI ఛార్జ్షీట్ దాఖలు చేయనుందని, అందులో విజయ్ పేరు ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతేడాది సెప్టెంబర్లో జరిగిన తొక్కిసలాటలో 40 మందికి పైగా చనిపోయారు.


