News September 12, 2025

కూకట్‌పల్లిలో రేపు జాబ్ మేళా

image

ఐటీ, డీపీఓ ఉద్యోగాలకు సంబంధించి రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి కిషన్ తెలిపారు. కూకట్‌పల్లి ప్రభుత్వ కళాశాలలో ఈ మేళా ఉంటుందన్నారు. ఇంటర్ మీడియట్‌లో 75 శాతం ఉత్తీర్ణత సాధించిన వారు ఈ మేళాకు హాజరు కావొచ్చన్నారు. అభ్యర్థులు ఫొటోలు, సర్టిఫికెట్లు తమ వెంట కచ్చితంగా తీసుకురావాలన్నారు. వివరాలకు 76740 07616, 79818 34205 నంబర్లను సంప్రదించాలన్నారు.

Similar News

News December 16, 2025

వరంగల్: 3వ విడతలో 530 పంచాయతీలకు ఎన్నికలు!

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫైనల్‌కి చేరాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3వ దశలో 564 పంచాయతీలకు ఎన్నికల నోటిఫికేషన్ వెలువడగా, 34 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. 530 పంచాయతీలకు బుధవారం పోలింగ్ జరగనుంది. వరంగల్ జిల్లాలో 107కి 7 ఏకగ్రీవం కాగా, హనుమకొండలో 68కి 1, జనగామలో 91కి 3, భూపాలపల్లిలో 81కి 3, ములుగులో 46కి 1, మహబూబాబాద్ జిల్లాలో 169కి 19 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

News December 16, 2025

‘అఖండ-2’లో బాలయ్య కూతురు ఎవరో తెలుసా?

image

‘అఖండ-2’లో బాలకృష్ణ కూతురిగా నటించిన హర్షాలీ మల్హోత్రా గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. సినిమాలో ఆమె ఐక్యూ 226, 17 ఏళ్లకే DRDO సైంటిస్ట్ అని చూపించడంతో మీమ్స్ వస్తున్నాయి. ముంబైలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి నాలుగేళ్లకే సీరియళ్లలో, ఏడేళ్ల వయసులో సల్మాన్ ఖాన్ ‘బజరంగీ భాయిజాన్’ మూవీలో నటించి మెప్పించారు. 2017 తర్వాత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. 8 ఏళ్ల తర్వాత ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

News December 16, 2025

తూ.గో: రికార్డు స్థాయికి చేరిన కోడిగుడ్డు ధర

image

కోడి గుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. కోడిగుడ్డును టోకుగా రూ.6.75, చిల్లరగా రూ.8 విక్రయిస్తున్నారు. నాలుగు దశాబ్దాల తరువాత మంచి ధర వచ్చిందని వ్యాపారులు సంబర పడుతున్నారు. ఉమ్మడి తూ.గో. జిల్లాలో 300 పౌల్ట్రీ ఫారాలు ఉండగా, వాటిలో 1.40 కోట్ల కోళ్లను పెంచుతున్నారు. వాటి నుంచి 1.10 కోట్లు గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. మండపేటలో ఎక్కువగా పౌల్ట్రీ ఫారాలు విస్తరించాయి. ధర మరింత పెరుగుతుందని చెబుతున్నారు.