News May 10, 2024

కూటమి పార్టీలకు షాక్: ధర్మాన కృష్ణదాస్

image

సంక్షేమ పథకాల పంపిణీకి హైకోర్టు అనుమతి ఇవ్వడం హర్షణీయమని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. హైకోర్టు తీర్పుతో కూటమి పార్టీలకు షాక్ ఇచ్చినట్లు అయిందని పేర్కొన్నారు. టీడీపీ ఫిర్యాదుతో సంక్షేమ పథకాలు పంపిణీ జరగకుండా ఈసీ తీసుకున్న నిర్ణయంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పథకాలు కొత్తవి కాదని.. ఎప్పటి నుంచో అమలవుతున్నాయని హైకోర్టు స్పష్టం చేసిందన్నారు.

Similar News

News February 12, 2026

శ్రీకాకుళం ఎంపీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్టుల ఏర్పాటుపై ఇరువురు చర్చించారు. దేశవ్యాప్తంగా విమానయాన రంగాన్ని విస్తరిస్తున్న మంత్రి కృషిని సీఎం అభినందించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరించాలని కోరారు. ఈ భేటీలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News February 12, 2026

నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

image

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.

News February 12, 2026

నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

image

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖంచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.