News December 14, 2025

కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా ఏపీ: బొత్స

image

AP: ఆరోగ్యంగా ఉన్న ఏపీ కూటమి పాలనలో అప్పుల రాష్ట్రంగా దూసుకుపోతుందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. ‘18 నెలల వ్యవధిలోనే రూ.2.66 లక్షల కోట్లు అప్పు చేసింది. మేము అధికారంలో ఉన్న ఐదేళ్లలో సంక్షేమ పథకాల ఖర్చుకు రూ.3.45 లక్షలు కోట్లు అప్పు చేశాము. అయితే కూటమి ప్రభుత్వం అప్పులు ఎందుకు చేస్తుందో ఎవరికీ తెలియదు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక ఈ ప్రభుత్వం రైతులను కష్టపెడుతుంది’ అని ఫైరయ్యారు.

Similar News

News January 25, 2026

220 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

image

చెన్నై ఆవడిలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ 220 జూనియర్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి షార్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 13 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. బేసిక్ పే 21,000+IDA చెల్లిస్తారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. వెబ్‌సైట్: https://avnl.co.in లేదా www.ddpdoo.gov.in

News January 25, 2026

వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు

image

⋆ వాట్సాప్‌లో ‘సెకండరీ అకౌంట్స్’ ఫీచర్ రానుంది. పిల్లల కోసం పేరెంట్స్ ఈ అకౌంట్స్ క్రియేట్ చేయవచ్చు. వీటిలో స్టేటస్/ఛానల్ అప్‌డేట్స్ రావు. కాంటాక్ట్స్‌లో లేని వారితో చాట్ చేయరాదు.
⋆ IOS యూజర్లకు చాట్ హిస్టరీ షేరింగ్ ఆప్షన్ రానుంది. గ్రూప్‌లో ఆల్రెడీ ఉన్నవాళ్లు కొత్త మెంబర్‌కి 100 మెసేజ్‌లను షేర్ చేయొచ్చు.
⋆ యూరప్, UKలో యాడ్ ఫ్రీ ఫీచర్ రానుంది. డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే యాడ్స్ రావు.

News January 25, 2026

ఇంటర్ పరీక్షల్లో మార్పులు.. ఇవి తెలుసా?

image

AP: ఈ ఏడాది ఇంటర్ పరీక్షల సరళి మారింది. మ్యాథ్స్ (A,B) ఒకే సబ్జెక్టుగా, బాటనీ, జువాలజీలను విలీనం చేయడంతో గ్రూపు సబ్జెక్టులు 6 నుంచి 5కు తగ్గాయి. కొత్తగా వచ్చిన ఎలక్టివ్ విధానంతో విద్యార్థులు నచ్చిన సబ్జెక్టును ఎంచుకోవచ్చు. చాలా మంది MBiPC వైపు మొగ్గు చూపుతున్నారు. రోజుకు ఒక సబ్జెక్టు చొప్పున 23 రోజులు పరీక్షలు జరుగుతాయి. మార్కుల విషయంలోనూ మార్పులు చేశారు. ఆన్సర్ షీట్ పేజీలను 32కు పెంచారు.