News April 30, 2024
కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరి మృతి

కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంఘటన శావల్యాపురం మండలం కారుమంచిలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు.. గ్రామంలోని పెట్రోల్ బంక్ వద్ద కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 12 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో పదిమందికి గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని 108 ద్వారా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
GNT: నేడు డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు ప్రారంభం

మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం రాష్ట్రంలోని డ్రగ్ స్టోర్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. మంగళగిరి ఏపీఐఐసీ 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాలను ఉదయం 10.30 గంటలకు మంత్రి ప్రారంభిస్తారని చెప్పారు. ప్రభుత్వం అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు చేస్తుందని అన్నారు.
News December 9, 2025
స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షా కాలంలో చిగ్గర్ మైట్ కుట్టడం వల్ల ఈ జ్వరాలు వస్తాయని తెలిపారు.
News December 9, 2025
స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా చూడాలి: కలెక్టర్

జిల్లాలో స్క్రబ్ టైఫస్ మరణాలు సంభవించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్లో కలెక్టర్ స్క్రబ్ టైఫస్ నివారణ, ముందస్తు జాగ్రత్త చర్యలు, హౌసింగ్, ఉపాధి హామీ పనులు, గ్రామ వార్డు సచివాలయాల సేవలతో సహా పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షా కాలంలో చిగ్గర్ మైట్ కుట్టడం వల్ల ఈ జ్వరాలు వస్తాయని తెలిపారు.


