News March 12, 2025
కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్లో మార్పులు

విజయవాడ, కొండపల్లి మీదుగా తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.17405 TPTY- ADB రైలు ఈ నెల 26, నం.17406 ADB- TPTY రైలు ఈ నెల 27 నుంచి ఆ స్టేషన్లలో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను పై తేదీల నుంచి చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.
Similar News
News February 18, 2026
పార్టీ నేతలపై బొత్స పట్టు కోల్పోయారు: లోకేశ్

AP: మండలిలో YCP పక్షనేత బొత్స సత్యనారాయణ ఆ పార్టీ నేతలపై పట్టు కోల్పోయారని మంత్రి లోకేశ్ విమర్శించారు. ‘YCP నుంచి ఇద్దరు MLCలు వేర్వేరుగా వాయిదా తీర్మానాలు ఇచ్చారు. ఒకరు లడ్డూ కల్తీపై, మరొకరు ఇందాపూర్ డెయిరీపై చర్చ అడిగారు. వారిలో ఎవరు పైచేయి సాధిస్తారనే ఆసక్తి మాలో ఉంది’ అని మీడియాతో వ్యాఖ్యానించారు. ఇందాపూర్ డెయిరీకి హెరిటేజ్తో సంబంధం ఉందని, అందుకే చర్చ పెట్టాలని అడుగుతున్నట్లు బొత్స తెలిపారు.
News February 18, 2026
నిజామాబాద్లో టమాటా ధర ఎంతంటే?

నిజామాబాద్లో టమాటా ధర బాగా తగ్గింది. హోల్సేల్లో కిలో రూ.4-5 ఉండగా రిటైల్ మార్కెట్లో రూ.10 కిలోగా ఉంది. ఇక బెండకాయ, బీరకాయ రూ.80 కిలో, పచ్చి మిర్చి రూ.70, ఆలుగడ్డలు రూ.20, చిక్కుడుకాయ రూ.40, క్యాప్సికం రూ.60, క్యారెట్ రూ.50, బీట్ రూట్ రూ.50, వంకాయ రూ.40, చామ గడ్డ రూ.50, బిన్నీస్ రూ.80 కిలో, సొరకాయ ఒకటి 10 నుంచి 20 రూపాయలుగా ఉంది. కొత్తిమీర కట్ట రూ.10 నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
News February 18, 2026
OTD: టీమ్ఇండియా సంచలన విజయం

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు రాజ్కోట్లో టీమ్ఇండియా చరిత్రాత్మక విజయాన్ని సాధించింది. ENGతో 3rd టెస్టులో 434 రన్స్ తేడాతో గెలిచింది. టెస్టుల్లో పరుగుల పరంగా భారత జట్టుకు ఇదే అతిపెద్ద విజయం. తొలి ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ(131), జడేజా(112), రెండో ఇన్నింగ్స్లో జైస్వాల్ (214), గిల్ (91) రాణించారు. రెండు ఇన్నింగ్స్లలో కలిపి జడేజా 7, సిరాజ్ 4, బుమ్రా 2, అశ్విన్ 2, కుల్దీప్ 4 వికెట్లు తీశారు.


