News May 13, 2024

కృష్ణా జిల్లా ఎన్నికల సంగ్రామంలో 94 మంది

image

నేడు జరగనున్న ఎన్నికల కురుక్షేత్రంలో కృష్ణా జిల్లా నుంచి 94 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మచిలీపట్నం పార్లమెంట్‌కు 15 మంది పోటీ పడుతుండగా ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 79 మంది పోటీ పడుతున్నారు. గన్నవరంలో 12, గుడివాడలో 12, పెడనలో 10, మచిలీపట్నంలో 10, అవనిగడ్డలో 12, పామర్రులో 08, పెనమలూరులో 11 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పోటీ వైసీపీ, కూటమి (టీడీపీ+జనసేన) అభ్యర్థుల మధ్యే నెలకొంది.

Similar News

News December 15, 2025

రేపు మచిలీపట్నంకు నారా లోకేశ్, పీవీఎన్ మాధవ్ రాక

image

మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు PVN మాధవ్ మంగళవారం మచిలీపట్నం రానున్నారు. స్థానిక న్యూ హౌసింగ్ బోర్డ్ రింగ్‌లో ఉమ్మడిగా ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని వాజ్ పేయి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాంస్య విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఇరువురు నేతలు పాల్గొననున్నట్లు ఆయా పార్టీ వర్గాలు తెలిపాయి. ఇరువురి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

News December 15, 2025

ముస్తాబాద్: యంత్రాలతో వరిగడ్డి కట్టలు.. రూ. 40 వేలు ఆదా

image

ముస్తాబాద్ ప్రాంతంలో వరి నూర్పిడి తర్వాత పొలాల్లోని ఎండుగడ్డిని తగులబెట్టడం వల్ల కాలుష్యం, భూసారం నష్టం జరుగుతున్నప్పటికీ 75 శాతం మంది రైతులు అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. అయితే, కొందరు రైతులు యంత్రాల సహాయంతో వరిగడ్డిని కట్టలుగా చేసి, పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి ద్వారా రైతులు సుమారు రూ.40 వేల వరకు ఖర్చు ఆదా చేసుకుంటున్నారు. ఇది పర్యావరణానికి, రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు.

News December 15, 2025

కృష్ణా ఫెన్సింగ్‌కు కాంస్య పతకాలు

image

గుంటూరు జిల్లా వెనిగండ్లపాడులో జరిగిన అంతర జిల్లాల ఫెన్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కృష్ణా జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. అండర్-19 విభాగంలో బాలికల శాబర్ జట్టు, బాలుర ఇప్పి జట్టు, బాలుర ఫోయిల్ జట్లు కాంస్య పతకాలను సాధించాయి. కృష్ణా జిల్లా ఫెన్సింగ్ శిక్షకులు ధనియాల నాగరాజు విజేతలను అభినందనలు తెలిపారు.