News November 7, 2025

కృష్ణా నదిలో దూకి మహిళ ఆత్మహత్య

image

కృష్ణా నదిలో దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన పెనుమూడిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. రేపల్లెలోని 5వ వార్డుకు చెందిన గరికపాటి రమాదేవి (29) పెనుమూడి-పులిగడ్డ వారధిపై నుంచి నదిలోకి దూకింది. మత్స్యకారులు ఆమెను ఒడ్డుకు చేర్చి రేపల్లె ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 17, 2026

ఇంటి వద్దకే మేడారం ప్రసాదం

image

TG: మేడారం జాతర కోసం TGSRTC వినూత్న సేవలు ప్రారంభించింది. జాతరకు వెళ్లలేని భక్తులు రూ.299 చెల్లిస్తే ఇంటివద్దకే ప్రసాదం వస్తుంది. అమ్మవార్ల ఫొటో, పసుపు, కుంకుమ, బెల్లం ఉండే ప్యాకెట్‌ను సురక్షితంగా డెలివరీ చేస్తారు. ఈ సేవలు ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బుకింగ్‌కు అవకాశం ఉంది. www.tgsrtclogistics.co.in లేదా 040-69440069, 040-23450033ను సంప్రదించవచ్చు.

News January 17, 2026

ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి గుర్తించుకోండి

image

ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అవసరమే అయినా, సరైన అవగాహన లేకుంటే నష్టమే వస్తుంది. పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీల ఆఫర్లను కంపేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ నిబంధనలను పూర్తిగా చదవాలని, క్లెయిమ్ ప్రక్రియ వేగంగా జరిగే కంపెనీలను ఎంచుకోవాలని అంటున్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి రైడర్లను తీసుకుంటే మరింత బాగుంటుంది.

News January 17, 2026

ఖమ్మం: మేడారం చెంతకు RTC బస్సులు.. టికెట్ ధరలు ఇవే!

image

సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర-2026 సందర్భంగా భక్తుల కోసం TGSRTC అధికారులు ప్రత్యేక బస్సు ఛార్జీలను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల ధరల పట్టికను విడుదల చేశారు. ఖమ్మం నుంచి రూ.480, కొత్తగూడెం- రూ.350, పాల్వంచ- రూ.310, మణుగూరు- రూ.210, భద్రాచలం- రూ.300, ఇల్లందు- రూ.400, ఇల్లందు వయా గుండాల- రూ.270గా ఖరారు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతామని చెప్పారు.