News June 13, 2024

కృష్ణా: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ రైల్వే డివిజన్‌లో ట్రాఫిక్ మెయిన్‌టెనెన్స్ పనుల కారణంగా గుంటూరు- విజయవాడ మధ్య ప్రయాణించే మెము ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేశామని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు నం.07864 గుంటూరు- విజయవాడ ట్రైన్‌ను ఈ నెల 24 నుంచి ఆగస్టు 15 వరకు, నం.07628 విజయవాడ- గుంటూరు ట్రైన్‌ను ఈ నెల 21 నుంచి ఆగస్టు 12 వరకు రద్దు చేశామంది. ప్రయాణికులు రైళ్ల రద్దు అంశాన్ని గమనించాలని కోరింది.

Similar News

News March 18, 2025

కృష్ణా: పెండింగ్ పనులు పూర్తి చేయాలి- కలెక్టర్

image

మచిలీపట్నం కలెక్టరేట్‌లో కలెక్టర్ డీకే బాలాజీ తన ఛాంబర్‌లో గ్రామీణ నీటి సరఫరా విభాగం, ఐసీడీఎస్, సీపీఓ, గనులు, జిల్లా పంచాయతీ తదితర శాఖల అధికారులతో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు, ఎంపీ లాడ్స్, జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్, జడ్పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. సోమవారం కలెక్టర్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల భవనాల మరమ్మతులకు సంబంధించిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. 

News March 17, 2025

కృష్ణా: ప్రజా సమస్యలు పరిష్కరించండి- ఎస్పీ 

image

కృష్ణా జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఆర్ గంగాధర రావు పాల్గొని 44 ఫిర్యాదులను స్వీకరించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. సంబంధిత పోలీస్ అధికారులు సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు.

News March 17, 2025

కృష్ణా: జిల్లాలో TODAY TOP NEWS

image

★ కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా పది పరీక్షలు..<<15794120>> 286 గైర్హాజరు <<>>
★ కృష్ణా: Way2Newsతో విద్యార్థులు
★ కృష్ణా: టెన్త్ విద్యార్థులకు యూనిఫామ్<<15791358>> అనుమతి లేదు<<>>
★ అసెంబ్లీలో గన్నవరం <<15790326>>ఎమ్మెల్యే ఆవేదన<<>>
★ కృతి వెన్నులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
★ అవనిగడ్డలో కొడుకు ముందే తల్లి మరణం
★ పెడనలో టీడీపీ <<15787375>>నాయకుడిపై దాడి<<>>
★ గన్నవరంలో వెటర్నరీ విద్యార్థుల<<15792654>> ఆందోళన<<>>

error: Content is protected !!