News December 4, 2024
కృష్ణా: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల టైం టేబుల్ విడుదల
కృష్ణా యూనివర్సిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో డిగ్రీ కోర్సులు చదివే విద్యార్థులు(2020-21 విద్యా సంవత్సరం) రాయాల్సిన 1వ సెమిస్టర్ రెగ్యులర్&సప్లిమెంటరీ పరీక్షల రివైజ్డ్ టైం టేబుల్ విడుదలైంది. DEC 18-2025 JAN 3 మధ్య నిర్ణీత తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. టైం టేబుల్ పూర్తి వివరాలకై https://kru.ac.in/ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
Similar News
News January 19, 2025
పెనమలూరు: బాలికపై లైంగిక దాడికి యత్నించిన ప్రబుద్ధుడు
తాడిగడప కంటి ఆసుపత్రి సమీపంలో నివసిస్తున్న నారాయణ(60) తన ఇంటి సమీపంలో నివసిస్తున్న రెండో తరగతి చదివే బాలికపై లైంగిక దాడికి యత్నించడంతో పెనమలూరు పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం రాత్రి బాలిక తమ కుక్క పిల్ల కోసం నారాయణ ఇంటి సమీపంలోకి వెళ్లింది. అతడు లైంగిక దాడి చేయబోగా బాలిక తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన శనివారం అతడిని అరెస్ట్ చేశారు.
News January 19, 2025
కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన షెడ్యూల్
కేంద్ర మంత్రి అమిత్షా గన్నవరం పర్యటన షెడ్యూల్ వివరాలను సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆదివారం ఉదయం 10.45 గంటలకు విజయవాడలోని నోవాటెల్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణించే అమిత్షా కొండపావులులోని NIDM ప్రాంగణానికి చేరుకుంటారన్నారు. 11.15కి అక్కడ భవనాలను లాంఛనంగా ప్రారంభించిన అనంతరం 11.35 గంటలకు NDRF పదో బెటాలియన్ క్యాంపస్ను ప్రారంభించి సభలో ప్రసంగిస్తారన్నారు.
News January 19, 2025
జగ్గయ్యపేట: తల్లితో సహజీనం చేస్తున్న వ్యక్తిని చంపాడు
ఈనెల 16న జగ్గయ్యపేటకు చెందిన ఎర్రంశెట్టి ఆంజనేయులు హత్యకు గురైన విషయం తెలిసిందే. హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు. బెల్లంకొండ నరేశ్ అనే వ్యక్తి హత్య చేసినట్లు నిర్ధారించారు. నరేశ్ తల్లి ఆంజనేయులుతో సహజీవనం చేస్తున్నందున తట్టుకోలేని నరేశ్ హత్యచేశాడు. హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.