News September 10, 2025
కేయూలో LLB పరీక్షలు వాయిదా

కాకతీయ యూనివర్సిటీ(కేయూ) పరిధిలో ఈనెల 12న జరగాల్సిన ఎల్ఎల్బీ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సు రెండో సెమిస్టర్(మూడో పేపర్), ఐదేళ్ల లా కోర్సు ఆరో సెమిస్టర్(మూడో పేపర్) పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కే.రాజేందర్ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలను ఈనెల 15న నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.
Similar News
News December 12, 2025
ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

AP: అల్లూరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు <<18539107>>ప్రమాదంపై<<>> సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు తక్షణమే ఘటనాస్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
News December 12, 2025
మహిళల్లో ఐరన్ లోపం లక్షణాలివే..

మహిళల్లో ఐరన్ లోపం ఉంటే అలసట, బలహీనత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జుట్టు ఎక్కువగా రాలడం కూడా ఐరన్ లోపానికి సంకేతాలే. దీన్ని తగ్గించడానికి పాలకూర, బీట్రూట్, పప్పులు, మాంసం, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు తీసుకోవాలి. అలాగే టమిన్-సి ఐరన్ శోషణకు సహాయపడుతుంది. నారింజ, నిమ్మకాయ, ద్రాక్ష, స్ట్రాబెర్రీ వంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
News December 12, 2025
సంగారెడ్డి: అన్నా 14 నాడు పక్కా రావాలే… నీ ఓటు నాకే.

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్ చేసి “అన్నా, 14న తప్పకుండా రావాలె, నీ ఓటు నాకే” అంటూ కోరుతున్నారు. బస్సు ఛార్జీలు, ఇతర ఖర్చులు తామే చెల్లిస్తామని హామీ ఇస్తూ, ఓటర్లను తమ సొంతూళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.


