News April 14, 2025
కైలాసపట్నం: చేనేత వృత్తిని వదులుకున్న వేణు మృతి

కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గంపెన వేణు మృతి చెందాడు. వేణు మొదట్లో చేనేత కార్మికుడిగా పనిచేసేవాడు. ఆ వృతి లాభసాటిగా లేకపోవడంతో బాణసంచా తయారీ కేంద్రంలో కార్మికుడిగా చేరి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. తమ కుటుంబానికి దిక్కు ఎవరంటూ భార్య భవాని, పిల్లలు బోరున విలపించారు.
Similar News
News January 18, 2026
నేవీలో క్యాడెట్ ఎంట్రీ స్కీమ్కు అప్లై చేశారా?

<
News January 18, 2026
కారణజన్ముడు ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు

AP: NTR కారణజన్ముడు, యుగ పురుషుడు, పేదల పెన్నిధి అని CM CBN అన్నారు. ఆయన 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘‘సిని వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ NTR తరతరాల చరిత్రను తిరగరాశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టారు. రూ.2కే కిలో బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు తదితర పథకాలతో చరిత్ర గతిని మార్చారు’’ అని కొనియాడారు.
News January 18, 2026
మందమర్రి మున్సిపల్ .. వివాదాల కొర్రి!

జిల్లాలో 30 ఏళ్ల క్రితమే మున్సిపాలిటీగా అవతరించిన మందమర్రి వివాదాల కారణంగా ఎన్నికలకు నోచుకోవడం లేదు. ఈసారి కూడా ఎన్నికలు జరగటం లేదు. 30ఏళ్ల క్రితం 1/70 చట్ట పరిధిలో ఉన్న మందమర్రిని మున్సిపాలిటీ చేసి ఎన్నికలకు రిజర్వేషన్లు సైతం ప్రకటించారు. షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్న మున్సిపాలిటీ SC రిజర్వు కావడంతో ST వర్గానికి చెందిన పెద్దలు కోర్టును ఆశ్రయించారు. దీంతో 3దశాబ్దాలుగా పాలకులు లేకుండా కొనసాగుతోంది.


