News December 1, 2025

కొండగట్టు ఘటనపై జిల్లా కలెక్టర్ సమగ్ర సమీక్ష

image

జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టులో శనివారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా సుమారు 30 దుకాణాలు దగ్ధమయ్యాయి. ఆదివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఘటన స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి రూ.5,000 తక్షణ సహాయం అందిస్తున్నట్టు తెలిపారు. బాధితులకు ఆహారం, వస్త్రాలు అందించాలని, ప్రమాదంపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఎమ్మార్వో, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Similar News

News February 13, 2026

కర్నూలు విద్యార్థిని మృతి.. రూ.262 కోట్ల పరిహారం

image

అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యం వల్ల మృతి చెందిన కర్నూలు విద్యార్థిని జాహ్నవి(23) కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆమె కుటుంబానికి 29 మిలియన్ డాలర్లు (సుమారు రూ.262 కోట్లు) పరిహారం చెల్లించేందుకు సియాటెల్ సిటీ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన జాహ్నవి 2023 జనవరి 3న రాత్రి రోడ్డు దాటుతుండగా పోలీస్ పెట్రోలింగ్ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది.

News February 13, 2026

కౌంటింగ్ కేంద్రాల్లోకి ఈ వస్తువులు నిషేధం: కామారెడ్డి SP

image

మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హాజరయ్యే అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద నిబంధనలు పాటించాలని కామారెడ్డి SP రాజేష్ చంద్ర స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే వారు అగ్గిపెట్టెలు, లైటర్లు, ఇంక్ బాటిల్స్, పేలుడు కారణమయ్యే వస్తువులు తీసుకురాకూడదని ఆదేశించారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీస్ సిబ్బందికి అభ్యర్థులు, ఏజెంట్లు పూర్తిస్థాయిలో సహకరించాలని ఆయన కోరారు.

News February 13, 2026

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న కౌంటింగ్.. లీడ్‌లో BNP!

image

బంగ్లాదేశ్‌లో 299 స్థానాల్లో పోలింగ్ ముగిసింది. మొత్తం 55% ఓటింగ్ నమోదైనట్లు సమాచారం. వెంటనే కౌంటింగ్ షురూ చేయగా ఇంకా కొనసాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ప్రకారం తారిఖ్ రెహ్మాన్‌కు చెందిన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ(BNP) లీడ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పోటీదారు జమాత్ ఇస్లామీ పార్టీకి ఓటర్ల మద్దతు తగ్గినట్లు సమాచారం. మరోవైపు BNP ఛైర్‌పర్సన్, ప్రధాని అభ్యర్థి రెహ్మాన్ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.