News November 30, 2025
కొండగట్టు బాధితులకు రూ.30 లక్షల పరిహారం ఇవ్వాలి: KTR

కొండగట్టు అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కొండగట్టులో జరిగిన నష్టం వివరాలను మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ను ఆయన అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ఒక్కో కుటుంబానికి రూ. 30 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సకాలంలో ఫైర్ ఇంజన్ రాకపోవడమే ఆస్తి నష్టం భారీగా జరగడానికి ప్రధాని కారణమని మండిపడ్డారు. ఇది ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యానికి నిదర్శనం అన్నారు.
Similar News
News February 17, 2026
అసెంబ్లీలో మూగబోయిన మైకులు

AP: అసెంబ్లీ మైకుల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు సభల్లో గంటకు పైగా అంతరాయం ఏర్పడింది. ఉదయం యథావిధిగా 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కాగా, సభ్యుల స్థానాల్లోని మైకులు పనిచేయలేదు. స్పీకర్ గంటపాటు సభను వాయిదా వేశారు. తర్వాత సమస్యను టెక్నీషియన్లు పరిష్కరించగా ఉ.11:30 గంటల నుంచి సభ తిరిగి ప్రారంభమైంది. శాసన మండలి కూడా ఉ.11 గంటలకు ప్రారంభమైంది. సమస్య తలెత్తడంపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 17, 2026
KMR: షబ్బీర్ అలీకి నా గురించి మాట్లాడే అర్హత లేదు: ఎమ్మెల్యే

కామారెడ్డి కాంగ్రెస్ నాయకుడు షబ్బీర్ అలీకి తన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆరోపించారు. మంగళవారం కామారెడ్డిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. షబ్బీర్ అలీ గతంలో హైదరాబాద్లోని ఉగ్రవాదుల ఇంటికి వెళ్లిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసన్నారు. షబ్బీర్ అలీ గతంలో మున్సిపల్ ఛైర్పర్సన్ వద్ద ఎంత వసూలు చేశాడో తాను నిరూపిస్తానన్నారు.
News February 17, 2026
GMA గ్లోబల్ అధ్యక్షుడిగా ఖమ్మం వాసి

గ్లోబల్ మున్నూరు కాపు అసోసియేషన్ (GMA) అధ్యక్షుడిగా ఖమ్మం నగరానికి చెందిన విజయ్ దండ్యాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికాలో ఐటీ కంపెనీ సీఈఓగా ఉన్న ఆయన ఖమ్మం ఐటీ హబ్లోనూ బ్రాంచ్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. ఆయన ఎంపిక పట్ల జిల్లా మున్నూరు కాపు సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు.


