News April 13, 2025

కొండారెడ్డిపల్లిలో మౌలిక వసతుల అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష

image

వంగూర్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సమీక్ష నిర్వహించారు. సీఎం సొంత గ్రామంలో రైతు కమిషన్ సభ్యుడు కేవీయన్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులతో కలసి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామ రహదారి విస్తరణ పనులను వేగంగా పూర్తి చేయాల్సిందిగా సూచనలు చేశారు. పలు అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Similar News

News January 17, 2026

రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణం: ఖమేనీ

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రిమినల్ అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫైరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం ఉందని ఆరోపించారు. ‘దేశంలో జరుగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి విదేశీయులే కారణం. అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించి, వేలాది మందిని చంపారు. దేశాన్ని యుద్ధంలోకి లాగబోం. అలానే స్థానిక, అంతర్జాతీయ నేరస్థులను శిక్షించకుండా వదలబోం’ అని స్పష్టం చేశారు.

News January 17, 2026

తిరుపతి: డ్రైవర్ల కష్టాలు.. ఇంకెంతకాలం.!

image

జిల్లా వాసులు టాక్సీలకు FC రెన్యువల్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారు. TPT, తిరుమల కేంద్రంగా అనేక టాక్సీలు నడుస్తున్నాయి. లారీలు, ఇతర వాహనాలు సైతం పెద్ద సంఖ్యలో తిరుగుతున్నాయి. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ATC(ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్) లేకపోవడంతో అటు చిత్తూరు(D)లోని బంగారుపాళ్యం ATC, ఇటు నెల్లూరు(D) ముత్తుకచూరు ATCకి వెళ్లాల్సి వస్తోంది. ఇకనైనా అధికారులు దీనిపై చర్యలు చేపట్టాలని పలువురు కోరారు.

News January 17, 2026

RCB అభిమానులకు గుడ్‌‌న్యూస్

image

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్, ఇంటర్నేషనల్ మ్యాచులు నిర్వహించేందుకు కర్ణాటక ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ విషయాన్ని KA క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. ప్రభుత్వ నిబంధనలు, షరతులకు లోబడి మ్యాచులు నిర్వహించుకోవాలని చెప్పినట్లు పేర్కొంది. కాగా గతేడాది ఆర్సీబీ ఐపీఎల్ కప్ గెలిచిన తర్వాత చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించారు. అప్పటి నుంచి స్టేడియంపై నిషేధం ఉంది.