News September 10, 2025

కొడంగల్: ‘నాణ్యమైన భోజనం అందించాలి’

image

వసతి గృహల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు మెరుగైన విద్య అందించాలని జిల్లా BC వెల్ఫేర్ అధికారులు మాధవ రెడ్డి, భీమ్ రాజ్ చెప్పారు. కొడంగల్ బాలుర BC వసతి గృహాన్ని వారు సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం, వసతులపై వార్డెన్ రాధికతో మాట్లాడారు. అనంతరం ‘పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా కొనసాగిన ఎన్నికలు: కలెక్టర్

image

2వ సాధారణ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో 2వ విడత సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమస్యత్మక పోలింగ్ కేంద్రాల వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళి, కౌంటింగ్ ప్రక్రియను అధికారులతో కలిసి పరిశీలించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించి వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించామన్నారు.

News December 14, 2025

నర్సాపూర్‌కు వందేభారత్.. ఒంగోలులో టైమింగ్స్ ఇవే.!

image

చెన్నై–విజయవాడ వెళ్లే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ (20677/20678)ను నరసాపూర్ వరకు పొడిగించారు. ఈ రైలుకు ఒంగోలు స్టేషన్‌లో స్టాపింగ్ ఉంది. చెన్నై నుంచి ఉ. 5.30కి బయలుదేరి ఒంగోలుకు ఉదయం 10.09కి చేరి 10.10కి బయలుదేరుతుంది. నరసాపూర్ నుంచి మధ్యాహ్నం 2.50కి బయలుదేరే రైలు, ఒంగోలుకు సాయంత్రం 6.29కి చేరి 6.30కి బయలుదేరుతుంది. డిసెంబర్ 15 నుంచి నరసాపూర్ నుంచి, డిసెంబర్ 17 నుంచి చెన్నై నుంచి ప్రారంభం కానుంది.

News December 14, 2025

సంగారెడ్డి: మధ్యాహ్నం 1 వరకు 82.75 పోలింగ్

image

సంగారెడ్డి జిల్లాలోని 10 మండలాల్లో ఆదివారం మధ్యాహ్నం ఒకటి వరకు 82.75% పోలింగ్ నమోదయింది. మొత్తం 2,99,578 మంది ఓటర్లకు గాను 2,47,911 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ ప్రావీణ్య చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.