News September 11, 2025
కొత్తగూడెం: గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి ఎం.అన్వేష్ తెలిపారు. ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తామని ఆయన చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 13లోపు అందుబాటులో ఉన్న గురుకుల పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Similar News
News December 12, 2025
చిత్తూరు: 2.22 లక్షల మందికి పోలియో చుక్కలు

ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు వేసేలా అధికారులు ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకోవాలని చిత్తూరు డీఆర్వో మోహన్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో పల్స్ పోలియో సమావేశం శుక్రవారం నిర్వహించారు. డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లాలో 2.22 లక్షల మంది చిన్నారులు ఉన్నారని, వీరికి 142 రూట్లలో 5,794 బూత్ల పరిధిలో చుక్కలు వేయనున్నట్లు చెప్పారు.
News December 12, 2025
తిరుపతి SVU ఫలితాల విడుదల

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది LLM1, 3 MSc బయో కెమిస్ట్రీ, MSc జియోలజీ, M.Com (FM / A&F) మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. సంబంధిత ఫలితాలు విడుదలయ్యాయి. www.results.manabadi.co.in ద్వారా ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
News December 12, 2025
GNT: రేపు నవోదయలో ప్రవేశానికి ఎంట్రన్స్ పరీక్ష

దేశవ్యాప్తంగా నవోదయలో ఆరో తరగతి ప్రవేశానికి శనివారం పరీక్ష జరగనుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా మద్దిరాలలో ఉన్న నవోదయ విద్యాలయ ప్రవేశానికి 5,420 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మొత్తం 12 బ్లాకులలోని 23 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అడ్మిట్ కార్డు పొందటంలో ఇబ్బందులున్నచో నవోదయ విద్యాలయ మద్దిరాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


