News August 22, 2025
కొత్తగూడెం: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డులు లేవు’

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులు లేవని RTI రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ అన్నారు. శుక్రవారం RTI రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. సమాచార బోర్డుల్లో ప్రజా సమాచార అధికారి ఫోన్ నెంబర్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రెవెన్యూ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు.
Similar News
News January 15, 2026
ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

<
News January 15, 2026
ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.
News January 15, 2026
HYD: ఫ్యూచర్ సిటీలో ట్రాఫిక్ రద్దీకి చెక్

మహానగరంలో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంత కాదు. కిలోమీటర్ ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్లో ఈ సమస్య ఉండొద్దని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని ముందే అంచనా వేసి మహేశ్వరం, శంషాబాద్ ట్రాఫిక్ జోన్లుగా విభజించి 4 డివిజన్లు, 10 ట్రాఫిక్ PSలను నెలకొల్పనున్నారు. సమర్థ పర్యవేక్షణకు ట్రాఫిక్ జాయింట్ సీపీని కూడా నియమించనున్నారు.


