News November 19, 2025
కొత్తగూడెం: సివిల్స్ అభ్యర్థులకు రూ.లక్ష ప్రోత్సాహకం

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్స్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అర్హులైన అభ్యర్థులందరూ రూ.లక్ష ప్రోత్సాహకం కోసం దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరాం నాయక్ తెలిపారు. గతంలో మెయిన్స్కు ఎంపికై రూ.లక్ష ప్రోత్సాహకం పొందిన అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 13, 2026
Photo Gallery: సంక్రాంతి సంబరాల్లో సీఎం

AP: తన స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాల్లో CM చంద్రబాబు పాల్గొని వివిధ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. చిన్నారులకు మ్యూజికల్ చైర్స్, బ్యాలెన్స్ వాకింగ్, గన్నీ బ్యాగ్ రేస్, లెమన్ అండ్ స్పూన్, త్రీలెగ్ రేస్, గ్లాస్ అండ్ బెలూన్ రన్ వంటి పలు క్రీడలను నిర్వహించారు. ఇందులో చంద్రబాబు, బాలయ్య మనవళ్లు కూడా పాల్గొన్నారు. మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి వారికి గిఫ్ట్స్ అందజేశారు.
News January 13, 2026
కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా..! రెవెన్యూ డివిజన్..?

విభజనపై జిల్లా వాసుల్లో, రాజకీయ నేతల్లో కలకలం మొదలైంది. జిల్లాల విభజన అంశం మళ్లీ తెరపైకి రాగా అధికారికంగా ప్రకటన చేయలేదు. కొడంగల్ విషయంలో ఏదైనా కొత్త నిర్ణయం జరగవచ్చని చెబుతున్నారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో కొంతకాలంగా అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో కొడంగల్ కేంద్రంగా ప్రత్యేక జిల్లా లేదా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చసాగుతోంది.
News January 13, 2026
బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో ఉద్యోగాలు

ముంబైలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (<


