News November 16, 2025

కొమురవెల్లి: మల్లన్న కళ్యాణం, జాతర ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష

image

కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి వారి కళ్యాణం, జాతర బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆదివారం కలెక్టర్ హైమావతి సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కొమురవెల్లిలో 14 డిసెంబర్ నుంచి 16 మార్చి 2026 వరకు జరిగే కార్యక్రమాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News

News January 13, 2026

నంద్యాల: నడివీధిలో చెప్పుతో కొట్టాడు.. న్యాయం చేయండి సార్..!

image

శిరివెళ్ల మండలం వణికందిన్నెకు చెందిన లక్ష్మీదేవి అనే మహిళ నంద్యాల జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తనను మహిళ అని కూడా చూడకుండా అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నడివీధిలో చెప్పుతో కొట్టి అవమానపరిచాడని ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆమె ఫిర్యాదు చేశారు. దాడిచేసిన వ్యక్తి నుంచి తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కోరారు.

News January 13, 2026

నల్గొండ: జిల్లాలో ఆరు ‘యంగ్‌ ఇండియా’ పాఠశాలలు

image

NLG జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌ పాఠశాలల’ నిర్మాణానికి భూములను గుర్తించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. NLG, మునుగోడులో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వచ్చే ఏడాది కల్లా స్కూల్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

News January 13, 2026

షాక్స్‌గామ్ వ్యాలీపై కన్నేసిన చైనా

image

జమ్ము కశ్మీర్‌లోని షాక్స్‌గామ్‌ వ్యాలీ ప్రాంతాన్ని తమ భూభాగం అంటూ చైనా మరోసారి ప్రకటించుకుంది. ఇప్పటికే ఆ ప్రాంతం మీదుగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టింది. చైనా చర్యను పలుమార్లు భారత్ ఖండించింది. అయితే షాక్స్‌గామ్‌ ప్రాంతం తమ భూభాగమేనని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ మీడియా సమావేశంలో తెలిపారు. కాగా 1963లో పాక్ అక్రమంగా 5,180 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని చైనాకు కట్టబెట్టింది.