News April 27, 2024

కొల్లు రవీంద్రపై 25 కేసులు.. తంగిరాల సౌమ్యపై 23 కేసులు

image

కొల్లు రవీంద్రపై 25, తంగిరాల సౌమ్యపై 23 కేసులు ఉన్నట్లు ఇటీవల వాళ్లు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. కొల్లు రవీంద్రపై సీఐడీ కేసు.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తదితర కేసులున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారనే కారణంతో తంగిరాల సౌమ్యపై 8 కేసులు.. శాంతి భద్రతల విఘాతం కలిగినందుకు పలు కేసులు నమోదయ్యాయి. ఇవన్ని వైసీపీ హయాంలోనే పెట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News April 14, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

image

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.

News April 14, 2026

కృష్ణా: పీజీఆర్ఎస్‌కు 132 అర్జీలు

image

పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్‌లో నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 132 అర్జీలు అందినట్టు అధికారులు తెలిపారు. శాఖల వారీగా అర్జీలను విభజించి ఆయా శాఖల అధికారులకు పరిష్కారం నిమిత్తం బదిలీ చేశామన్నారు.

News April 14, 2026

భూగర్భజలాల పెంపునకు చర్యలు చేపట్టండి: కలెక్టర్

image

జిల్లాలో జలధార పథకం కింద భూగర్భ జలాల మట్టం పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జలధార కార్యాచరణ ప్రణాళికపై సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు.