News December 6, 2024
కోటిమంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం: భట్టి
మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్స్ కుట్టే అవకాశం స్థానిక మహిళలకే ఇస్తున్నామని ఆయన తెలిపారు. డ్వాక్రా సంఘాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు శిల్పారామంలో వారు తయారు చేసిన ఉత్పత్తులు అమ్ముకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని ఆయన వెల్లడించారు.
Similar News
News January 20, 2025
సుందరీకరణ వైపు మన ఖమ్మం ఖిల్లా
మన ఖమ్మం ఖిల్లా కొత్త శోభ సంతరించుకోనుంది. పర్యటక రంగంగా పేరు ఉన్నప్పటికీ, సందర్శనకు ఆకట్టుకునే పరిస్థితి లేకపోవడంతో పాలకులు దృష్టి సారించారు. కొన్ని సంవత్సరాల తరువాత అభివృద్ధి పనులు సాగడంతో, ప్రాధాన్యత సంతరించుకుంటుందని భావిస్తున్నారు. ఖమ్మం ఖిల్లా పనులు పూర్తయితే, జిల్లా వాసులే కాక, ఇతర ప్రాంత పర్యటకులు ఇక్కడకి క్యూ కట్టడం ఖాయమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
News January 19, 2025
వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇస్తాం: Dy.CM భట్టి
తెలంగాణలో ఈనెల 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల జారీ అమలవుతుందని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ఎర్రుపాలెంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో భట్టి మాట్లాడుతూ.. భూమిలేని నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద రూ.12వేలు అందజేస్తామని స్పష్టం చేశారు. గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వివరించారు.
News January 19, 2025
బుగ్గపాడులో దంపతులు సూసైడ్.. ఆప్డేట్
సత్తుపల్లి మండలం బుగ్గపాడులో<<15185005>> కృష్ణ, సీత దంపతులు <<>>చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కృష్ణారావు లారీ, ఆటో, డీసీఎం కొనగా అవి ప్రమాదాలు, మరమ్మతులకు గురవడంతో అమ్మేశాడు. ఈక్రమంలో ఇల్లు గడవక, ఆదాయ మార్గం లేక ఇబ్బందిపడ్డాడు. తండ్రి పరిస్థితిని చూసి కుమార్తెలు సాయపడేవారు. వారిని ఇబ్బంది పెట్టలేక కృష్ణారావు దంపతులిద్దరూ చనిపోవాలని నిర్ణయించుకుని.. రావి చెరువులోకి దూకి సూసైడ్ చేసుకున్నారు.