News April 12, 2025

కోట్లలో వసూళ్లు.. ఒకరికి రిమాండ్: CID డీఎస్పీ

image

కామవరపుకోట(M) తడికలపూడి హర్షిత ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రెసిడెంట్ నందిగం ధర్మరాజును రాజమండ్రి CID పోలీసులు నిన్న అరెస్టు చేశారు. స్కూల్ నిర్వాహకులు నందిగం రాణి- ధర్మరాజు 15 మందిని మోసగించి రూ.కోట్లలో వసూలు చేశారని CID డీఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. ఈ కేసులో 3వ నిందితుడైన ధర్మరాజును అరెస్టు చేసి గుంటూరు జైలుకు రిమాండ్‌లో తరలించామన్నారు. అటు రూ.14.74కోట్ల ఆస్తి జప్తు చేయాలని ఆదేశాలు ఉన్నాయన్నారు.

Similar News

News February 14, 2026

దుబాయిలో నందిపేట మండల యువకుడి మృతి

image

నందిపేట మండలం లక్కంపల్లికి చెందిన పస్క రాజు(27) దుబాయ్‌లో మరణించారు. స్థానికుల వివరాల ప్రకారం.. రాజు తండ్రి మరణించడంతో కుటుంబ భారాన్ని మోస్తూ పొట్టకూటి కోసం దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ రాజు హఠాన్మరణం చెందారు. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి వచ్చేలా ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు.

News February 14, 2026

దివ్యాంగులకు ఫ్రీ బస్సు.. బడ్జెట్‌లో ప్రస్తావన

image

AP: రాష్ట్ర బడ్జెట్‌లో దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ‘ఇంద్రధనుస్సు’ పేరుతో అమలు చేయనున్నట్లు బడ్జెట్ ప్రతుల్లో పేర్కొంది. కాగా ప్రస్తుతం దివ్యాంగులు 50% టికెట్ సబ్సిడీతో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. అయితే ఈ స్కీమ్ ఎప్పటి నుంచి అమలు చేస్తారో వెల్లడించలేదు.

News February 14, 2026

HYD: ఇద్దరికి సున్నా.. వారి ఓటెవరికి వేసినట్లు?

image

RR మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటనలు. చేవెళ్ల 5th వార్డులో TRP అభ్యర్థి రాజుకు ఒక్క ఓటూ పడలేదు. తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. 1st వార్డులో BJP అభ్యర్థి శ్రీనివాస్‌కు 2ఓట్లు రాగా 4వవార్డు BJP అభ్యర్థి కేశపల్లి భాగ్యమ్మకు 2ఓట్లు వచ్చాయి. ఇబ్రహీంపట్నంలో 2nd వార్డ్‌లో అలీకి ఓట్లురాలేదు. 19thవార్డులో BSP అభ్యర్థి రఘుపతికి 1ఓటు పడింది. శంకర్‌పల్లిలో 13వవార్డు జనసేన అభ్యర్థి సాయికి 2ఓట్లు పడ్డాయి.