News March 26, 2024
కోడూరు: బైక్ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

రైల్వే కోడూరు మండలం మారావారిపల్లి వద్ద ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొనడంతో ఇద్దరు విద్యార్తులు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ సాహిల్, జస్వంత్ను తిరుపతి హాస్పిటల్కి తరలించామని తెలిపారు. సెట్టిగుంట పంచాయతీ లక్ష్మీ గారి పల్లె ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వీరు కోడూరులో పదో తరగతి పరీక్ష రాసి తమ గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు.
Similar News
News February 19, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో గురువారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,450
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,214
* 10 గ్రాములు వెండి ధర రూ.2,540.
News February 19, 2026
మహా శివరాత్రి.. కడప జిల్లా ఆర్టీసీకి ఆదాయం ఎంతంటే..!

మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప రీజియన్ ఏడు డిపోల నుంచి వివిధ శైవ క్షేత్రాలకు 1317 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు కడప జిల్లా ఆర్టీసీ అధికారి గోపాల్ రెడ్డి తెలిపారు. దాదాపు 1,46,077 KM నడిపినట్లు చెప్పారు. దీంతో రూ.1.11 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆదరించి ఆదాయం రావడానికి తోడ్పడిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు
News February 19, 2026
YVUలో కాన్వకేషన్.. డేట్ ఫిక్స్.!

YVU కాన్వకేషన్ మార్చి 11వ తేదీన నిర్వహించనున్నట్లు యోగివేమన విశ్వవిద్యాలయ వీసీ ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్ వెల్లడించారు. కాన్వకేషన్ నిర్వహణకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి తమకు ఉత్తర్వులు చేరాయన్నారు. వైవీయూ 11, 12, 13, 14వ కాన్వకేషన్ల ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకుంటారని చెప్పారు. కాన్వకేషన్ కోర్ కమిటీతో తన ఛాంబర్లో సమావేశమై నిర్వహణపై చర్చించారు.


