News May 15, 2024

కోస్గి: విమానం ఎక్కేలోగా మృత్యువడిలోకి..

image

కాసేపట్లో విమానం ఎక్కాల్సిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందారు. కోస్గికి చెందిన పలువురు వ్యాపారులు కుటుంబీకులతో కలిసి తీర్థయాత్రలకు బయలుదేరారు. మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లగా కాసేపట్లో విమానం ఎక్కాల్సి ఉంది. వారిలో ఒక్కరైన కూర వెంకటయ్య(75) అప్పటివరకు అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. వెంకటయ్య తోటి బృందం దిగ్భ్రాంతికి గురైంది. దీంతో కోస్గిలో విషాదం నెలకొంది.

Similar News

News December 6, 2025

సల్కర్ పేటలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

గడిచిన 24 గంటల్లో మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత స్వల్పంగా పెరిగింది. గండీడ్ మండలం సల్కర్ పేటలో 12.8 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 13.3, మిడ్జిల్ మండలం దోనూరు 13.4, రాజాపూర్ 13.6, జడ్చర్ల 14.1, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్, పారుపల్లి 14.7, భూత్పూర్ 14.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది.

News December 6, 2025

MBNR: ప్రభుత్వ ఉద్యోగులు.. ALERT!

image

మహబూబ్ నగర్ జిల్లాలో మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్ నగర్‌లలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఈనెల 8న తమ ఫారం-14 తీసుకొని నేరుగా తమ ఓటు హక్కు ఉన్న మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రంలో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు తమ ఓటును వేయొచ్చని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
#SHARE IT.

News December 5, 2025

MBNR: ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వెయ్యండి: కలెక్టర్

image

గ్రామపంచాయతీలో ఓటరుగా ఉండి, ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయడానికి అర్హులని కలెక్టర్ విజయేందిర బోయి తెలిపారు. ఇప్పటివరకు ఫారం-14 (పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు) దరఖాస్తు చేసుకున్న వారికి పోస్టల్ బ్యాలెట్ పంపడానికి ఎన్నికల యంత్రాంగం కసరత్తు చేపట్టిందని, మరో అవకాశంగా పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు.
SHARE IT.