News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
రోడ్డు ప్రమాద బాధితులకు ₹1.5 లక్షల క్యాష్లెస్ ట్రీట్మెంట్

రోడ్డు ప్రమాద బాధితులకు తక్షణ సాయం అందేలా ‘PM రాహత్’ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీ ఆమోదం తెలిపారు. దీని కింద బాధితులకు ₹1.5 లక్షల వరకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ అందుతుంది. వైద్య సాయం అందక ఎవరూ మరణించొద్దన్న లక్ష్యంతో ఈ స్కీమ్ను రూపొందించారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు రావాల్సి ఉంది. కొత్తగా ప్రారంభించిన ‘సేవా తీర్థ్’లో ప్రధాని మోదీ తీసుకున్న తొలి నిర్ణయాల్లో ఇదొకటి.
News February 13, 2026
రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్

IPL: రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కొత్త కెప్టెన్ నియమితులయ్యారు. రియాన్ పరాగ్ తమ సారథి అని ఆ జట్టు ట్వీట్ చేసింది. గతంలో ఈ జట్టుకు కెప్టెన్లుగా వ్యవహరించిన షేన్ వార్న్, రాహుల్ ద్రవిడ్, వాట్సన్, రహానే, స్టీవ్ స్మిత్, సంజూ శాంసన్ పేర్లతో పోస్టర్ రిలీజ్ చేసింది. గతేడాది వరకు సారథిగా వ్యవహరించిన సంజూ ట్రేడ్లో CSKకు వెళ్లిన విషయం తెలిసిందే. 2025 సీజన్లో పలు మ్యాచులకు పరాగ్ కెప్టెన్గా చేశారు.
News February 13, 2026
BIG BREAKING: నిర్మల్లో కాంగ్రెస్ విజయం

నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ మొత్తం 42 వార్డులకు గాను 25 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 14 వార్డులు బీజేపీ, ఎంఐఎం 2, BRS 1 వార్డు గెలిచింది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇక్కడ బీజేపీ MLA మహేశ్వర్ రెడ్డి ఎంత ప్రచారం చేసినా ఆ పార్టీని గెలిపించుకోలేకపోవడంతో స్థానికంగా జోరుగా చర్చ సాగుతోంది.


