News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 17, 2026

రాష్ట్రంలో వాలంటీర్ల నియామకం.. ఫొటోకు రూ.7-10

image

TG: పంటల నమోదు సర్వే కోసం ప్రతి గ్రామానికి ఒక వాలంటీర్ చొప్పున 10,909 మందిని నియమించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి ప్రాధాన్యం ఉంటుంది. ఒక్కో ఫొటోకు రూ.7 నుంచి రూ.10 వరకు చెల్లిస్తారు. 45 రోజుల యాసంగి సీజన్‌లో 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవచ్చు. విద్యార్హత పత్రాలతో మండల వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాలి.

News February 17, 2026

ఫ్యామిలీతో ఇండియాకు రండి.. తారిఖ్‌కు మోదీ ఆహ్వానం

image

బంగ్లాదేశ్ PM తారిఖ్ రెహ్మాన్‌కు భారత ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. పదవీకాలంలో విజయం సాధించాలని ఆకాంక్షించారు. భార్య జుబైదా, కుమార్తె జైమాతో కలిసి INDలో పర్యటించాలని ఆహ్వానించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కనెక్టివిటీ, ట్రేడ్, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్‌మెంట్, ఎనర్జీ, హెల్త్ కేర్ రంగాల్లో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

News February 17, 2026

భూపాలపల్లి: ఫిబ్రవరి 21 నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

image

భారత పత్తి సంస్థ మద్దతు ధర పత్తి కొనుగోళ్లు 21.02.2026 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిపివేయనున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ తెలిపింది. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికీ పత్తి అమ్మని రైతులు 20.02.2026 లోగా సమీప కొనుగోలు కేంద్రంలో కాపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకుని విక్రయించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.