News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 13, 2026
అదృష్టం వరించింది.. టాస్తో గెలిచారు

TG: దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మూడో వార్డు కౌంటింగులో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. BRS అభ్యర్థి కంకణాల ఎల్లవ్వ, బీజేపీ అభ్యర్థి శ్రీలత మధ్య చివరి వరకు తీవ్ర పోటీ నెలకొంది. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా ఫలితం మారలేదు. దీంతో అభ్యర్థుల సమ్మతితో టాస్ వేయగా ఎల్లవ్వను అదృష్టం వరించింది. దీంతో ఆమెను విజేతగా ప్రకటించారు.
News February 13, 2026
పిల్లల్లో మలబద్ధకానికి కారణాలివే..

పిల్లల్లో మలబద్ధకానికి ఎన్నో కారణాలుంటాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా తగినంత ఫైబర్, నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందంటున్నారు. IBS సమస్య ఉన్న చిన్నారుల్లో కూడా మలబద్ధకం కామన్గా కనిపిస్తుంది. ప్రయాణాలు, క్రమరహిత భోజన సమయాలు, జీవనశైలిలో తీవ్రమైన మార్పులు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల్లో అసౌకర్యాన్ని ఎప్పటికప్పుడు గమనించాలని సూచిస్తున్నారు.
News February 13, 2026
సచ్చిదానంద సరస్వతి స్వామి మృతి పట్ల జగన్ సంతాపం

తుని తపోవనం మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి శివైక్యం చెందడంపై మాజీ సీఎం జగన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. స్వామివారు జీవితాంతం ధర్మప్రచారం, వేద సంస్కృతి పరిరక్షణకు విశేష కృషి చేశారని కొనియాడారు. తపోవనం మఠాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది, భక్తులను సన్మార్గంలో నడిపించారని స్మరించుకున్నారు. వారి మరణం ఆధ్యాత్మిక రంగానికి తీరని లోటని, భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.


