News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
GHMCపై కొత్త బాస్ల సంతకం

GHMC 3 ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి కమిషనర్గా టి.వినయ్ కృష్ణారెడ్డిని, సైబరాబాద్ కమిషనర్గా సృజనతో స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆధ్యర్యంలో బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శక పాలన, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వారు పేర్కొన్నారు. నగర పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికోసం పనిచేస్తామని తెలిపారు.
News February 11, 2026
భారత్కు అనుకూలంగా ట్రేడ్ డీల్లో కండిషన్స్ మార్చిన US

భారత్-అమెరికా ట్రేడ్ డీల్లో వైట్ హౌస్ కీలక సవరణలు చేసింది. గతంలో భారత్ $500 బిలియన్ల విలువైన వస్తువులను కచ్చితంగా కొనాలని (Commits) పేర్కొన్న అమెరికా ఇప్పుడు దాన్ని ‘కొనే ఆలోచనలో ఉంది’ (Intends) అన్నట్లుగా మార్చింది. అమెరికా పప్పుధాన్యాలపై భారత్ టారిఫ్ తగ్గిస్తుందన్న పాయింట్నూ తొలగించింది. ఇండియా డిజిటల్ ట్యాక్స్ తొలగిస్తుందన్న స్థానంలో.. ఈ విషయంపై ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతాయని మార్చింది.
News February 11, 2026
GWL: జిల్లాలో18.42% పోలింగ్ నమోదు

గద్వాల జిల్లాలోని అయిజ, వడ్డేపల్లి, అలంపూర్, గద్వాల మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. గద్వాల మున్సిపాలిటీలోనీ 37 వార్డుల్లో 9 గంటల వరకు 17.08శాతం పోలింగ్ నమోదైంది. గద్వాల మున్సిపాలిటీలోనీ 37 వార్డుల్లో 9 గంటలకు 17.08, అలంపూర్..18.98, అయిజ 21.17, వడ్డేపల్లి 20.23, మొత్తం 18.42% మధ్యాహ్నం వరకు పోలింగ్ సరళి మరింత పెరిగే అవకాశం ఉంది.


