News April 27, 2025

క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

image

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్‌ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.

Similar News

News February 11, 2026

నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ శాతం పెరిగేనా?

image

మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పట్టణ ఓటర్లు ఓటు కోసం తరలివెళ్తారా అనేది అభ్యర్థులను కలవర పెడుతున్న అంశం. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కనిపించిన ఉత్సాహం మున్సిపల్ ఎన్నికల్లో కనిపించడం లేదు. 2020లో NZB కార్పొరేషన్, బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో 4,34,701 మంది ఓటర్లకు గాను 2,79,840 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోగా డివిజన్లు, వార్డుల్లో 80 శాతం పోలింగ్ దాటలేదు.

News February 11, 2026

రాజమండ్రి: వికసిత భారత్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా పురందేశ్వరి

image

‘వికసిత భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు- 2025’ సంయుక్త కమిటీ ఛైర్‌పర్సన్‌గా రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురందేశ్వరి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమె ప్రధాని మోదీ, స్పీకర్ ఓం బిర్లాకు కృతజ్ఞతలు తెలిపారు. 2047 నాటికి విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తూ, వికసిత భారత్ లక్ష్య సాధన కోసం కమిటీ సభ్యులతో కలిసి అంకితభావంతో కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు.

News February 11, 2026

GHMCపై కొత్త బాస్‌ల సంతకం

image

GHMC 3 ముక్కలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. మల్కాజిగిరి కమిషనర్‌గా టి.వినయ్ కృష్ణారెడ్డిని, సైబరాబాద్ కమిషనర్‌గా సృజనతో స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ఆధ్యర్యంలో బాధ్యతలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పారదర్శక పాలన, ప్రజాసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వారు పేర్కొన్నారు. నగర పరిశుభ్రత, మౌలిక వసతుల అభివృద్ధికోసం పనిచేస్తామని తెలిపారు.