News April 27, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 11, 2026
HYD: ‘అ’క్షరం.. ‘ఆ’కలి దుఃఖంలో కలిశాయి!

పాఠశాల ముగియగానే పిల్లలు గంతులేసుకుంటూ ఇళ్లకు వెళ్లి ఆడుకుంటారు. కానీ, ఈ చిన్నారి కథ వేరు. స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్లకుండా, మాదాపూర్లోని BIG C ముందు తల్లి కూర్చునే ఫుట్పాత్ వద్దకు వెళ్తుందా పాప. చెప్పులు కుట్టడంలో తల్లికి సాయం చేస్తూ, కస్టమర్లులేని సమయంలో హోంవర్క్ రాస్తోంది. చదవడానికి ఇంట్లో కనీస వసతులు లేకపోయినా, వీధి దీపాల వెలుతురులో చదువుతోంది. ఈ బుజ్జితల్లి ఉన్నత శిఖరాలకు చేరాలని కోరుకుందాం.
News February 11, 2026
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. కాకినాడ జిల్లా గళం వినిపించేనా?

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో కాకినాడ జిల్లా సమస్యలపై చర్చ మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు జిల్లాలోని ఆరుగురు ఎమ్మెల్యేలు (ఒకరు జనసేన, ఐదుగురు టీడీపీ) అసెంబ్లీలో జిల్లా గళాన్ని ఎంతవరకు వినిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది. పెండింగ్ ప్రాజెక్టులు, నిధుల మంజూరుపై ఈ ప్రజాప్రతినిధులు గట్టిగా పోరాడి జిల్లాకు మేలు చేస్తారా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.
News February 11, 2026
రామాయంపేట: తొలి ఓటుతో బాధ్యత చాటిన స్మిత

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రామాయంపేటలోని 4వ వార్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పోలింగ్ కేంద్రంలో యువతి స్మిత తన తొలి ఓటు హక్కును వినియోగించుకుంది. మొదటిసారి ఓటు వేయడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన ఈ శక్తివంతమైన హక్కును ప్రతి యువతీ యువకులు బాధ్యతగా వినియోగించుకోవాలని కోరింది. యువ ఓటర్లు ఉత్సాహంగా తరలివస్తుండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.


