News April 28, 2025
క్రెడిట్ కార్డ్ స్కామ్ ఇలా జరగవచ్చు: అన్నమయ్య ఎస్పీ

మీ క్రెడిట్ కార్డ్ పరిమితిని పెంచడానికి మీకు ఫోన్ కాల్, SMS వస్తే, అది సైబర్ మోసగాళ్ల పని అని. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సూచించారు. బ్యాంక్ ఉద్యోగిగా నటిస్తూ మాట్లాడి.. నమ్మించి CVV, OТР ఇతర వివరాలు తెలుసుకొని, మీ క్రెడిట్ కార్డ్ డేటా పొంది మీ కార్డులో ఉన్న లిమిట్ను ఖాళీ చేస్తారని చెప్పారు. మోసపోయిన వారు www.cybercrime.gov.in కు ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News February 17, 2026
BREAKING: ఇంద్రేశం ఛైర్మన్ పీఠం BRS కైవసం

కోరం లేక వాయిదా పడిన ఇంద్రేశం మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఎట్టకేలకు పూర్తయింది. రెండో రోజు 10 మంది BRS, ఇద్దరు BJP కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేయడంతో కోరం లభించింది. అనంతరం జరిగిన ఎన్నికలో మున్సిపల్ ఛైర్పర్సన్గా 8వ వార్డు BRS కౌన్సిలర్ కుషాంగుల ప్రమీల, వైస్ ఛైర్మన్గా 12వ వార్డు కౌన్సిలర్ పట్లోళ్ల హరీశ్ రెడ్డి ఎన్నికయ్యారు. నూతన పాలకవర్గానికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
News February 17, 2026
BREAKING: ఇల్లందు మున్సిపల్ ఛైర్ పర్సన్గా దొడ్డ కిరణ్ మిత్ర

ఇల్లందు మునిసిపాలిటీ ఛైర్ పర్సన్ అభ్యర్థిగా రెండవ వార్డు కౌన్సిలర్ దొడ్డ కిరణ్ మిత్రను కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఫైనల్ చేసింది. దొడ్డ కిరణ్ మిత్ర భర్త పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి విధేయతగా పనిచేస్తున్న వారికే అధిష్టానం మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టడం విశేషం. వైస్ ఛైర్మన్గా పెండ్యాల రాజు ఎన్నికయ్యారు.
News February 17, 2026
కనుపూరు ముత్యాలమ్మ జాతర ఎప్పుడో తెలుసా..

చిల్లకూరు మండలం తూర్పు కనుపూరులో వెలసియున్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మార్చి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా శ్రీ ముత్యాలమ్మ అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. ఈ జాతరకు ఏటా 5 లక్షల నుంచి 10 లక్షల వరకూ భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షలు పొందుతారు. ఈ జాతరకు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తారు.


