News September 12, 2025

క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి: జగిత్యాల కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కథలాపూర్ మండలం అంబర్‌పేట, చింతకుంట, భూషణరావుపేట గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు, గ్రామ పంచాయతీ హెల్త్ సెంటర్ భవన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News December 17, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (1/2)

image

ఉత్తరాంధ్ర ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్డు మార్గంలో 16 ప్రత్యేక రైళ్లకు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. జనవరి 9-19 వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. వాటి వివరాలు..
➣జనవరి 9, 11 తేదీల్లో సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07288)
➣జనవరి 10, 12 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07289)

News December 17, 2025

సంక్రాంతికి ఉత్తరాంధ్రకు ప్రత్యేక రైళ్లు (2/2)

image

సంక్రాంతికి హైదరాబాద్ నుంచి ఉత్తరాంధ్రకు నడిచే ప్రత్యేక రైళ్లు ఇవే..
➣జనవరి 10, 12, 16, 18 తేదీల్లో సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07290)
➣11, 13, 17, 19 తేదీల్లో శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07291)
➣13న వికారాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07294)
➣14న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07295)
➣17న సికింద్రాబాద్ ➝ శ్రీకాకుళం రోడ్డు (07292)
➣18న శ్రీకాకుళం రోడ్డు ➝ సికింద్రాబాద్ (07293)

News December 17, 2025

NTR: భారీగా పెరుగుతున్న ధరలు.!

image

ఎన్టీఆర్ జిల్లాలో కోడి గుడ్డు ధరలు భారీగా పెరుగుతున్నాయి. కోళ్ల ఫారాల వద్దే గుడ్డు ధర రూ.7 చేరడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ. 8 వరకు విక్రయిస్తుండగా, విజయవాడలో హోల్‌సేల్‌ ధర రెండు రోజుల్లో రూ. 215 నుంచి రూ. 225 పెరిగింది. రాబోయే రోజుల్లో గుడ్డు ధర రూ.10కు చేరే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.