News April 24, 2024
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_42024/1713855348980-normal-WIFI.webp)
ఖమ్మం ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రామసహాయం రాఘురాం రెడ్డి పేరుతో నామినేషన్ దాఖలు అయింది. ఈ సందర్భంగా నాయకులు నూకల నరేశ్ రెడ్డి, బొర్రా రాజశేఖర్, స్వర్ణ కుమారి, నిరంజన్ రెడ్డి రాఘురాం రెడ్డి తరుపున కలెక్టర్ గౌతమ్ కు నామినేషన్ పత్రాలు అందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ నామినేషన్ దాఖలు చేశారు. అయన అభ్యర్థిత్వాన్నే ఆదిష్టానం ఖరారు చేసే అవకాశం ఉంది.
Similar News
News January 24, 2025
ఖమ్మం: ఉద్యోగుల సమస్యలపై ఎంపీకి విన్నపం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737650206630_51825091-normal-WIFI.webp)
టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా కమిటీ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎంపీకి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి సమస్యలపై ఎంపీకి విన్నవించగా, పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు. కార్యక్రమంలో టీన్జీవోస్ సభ్యులు పాల్గొన్నారు.
News January 23, 2025
అర్హులందరికీ సంక్షేమ పథకాలు: పొంగులేటి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737613914835_18054828-normal-WIFI.webp)
ప్రాథమిక లిస్టులో పేర్లు రానివారు ఆందోళన చెందొద్దని, తిరిగి దరఖాస్తు చేసుకుంటే పథకాలకు ఎంపిక చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కేశవపురంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రభుత్వం ఓ పక్క అభివృద్ధితోపాటు మరోపక్క ప్రజలకు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తోందన్నారు.
News January 23, 2025
ఖమ్మం: తగ్గిన పత్తి, మిర్చి ధరలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1737610606100_20471762-normal-WIFI.webp)
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.14,250 జెండా పాట పలుకగా, క్వింటాల్ కొత్త మిర్చి ధర రూ.15,000గా జెండా పాట పలికింది. అలాగే, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర రూ.250, కొత్త మిర్చి రూ.100, పత్తి రూ.100 తగ్గినట్లు వ్యాపారస్థులు తెలిపారు.