News November 19, 2025

ఖమ్మం: చలా పంజా.. గజగజ వణుకుతున్న ప్రజలు

image

ఉమ్మడి జిల్లాలోని పల్లెలపై చలి పంజా విసురుతోంది. సాయంత్రం 6 గంటల నుంచే చలి తీవ్రత మొదలవుతుండటంతో ప్రజలు గజగజ వణుకుతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటల వరకు చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

Similar News

News January 20, 2026

సంగారెడ్డి: 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ నెల 21, 22 తేదీల్లో ఇంగ్లీష్ ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. విద్యార్థులు ఉదయం 9 గంటలకు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని చెప్పారు. పరీక్షలకు గైర్హాజర్ అయితే ఫెయిల్ అయినట్లు పరిగణిస్తామని పేర్కొన్నారు.

News January 20, 2026

వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి దరఖాస్తు ఎలా?

image

రైతులు ఈ పథకం కోసం స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి (AEO) లేదా వ్యవసాయాధికారిని సంప్రదించి దరఖాస్తు తీసుకొని, తమకు కావలసిన యంత్రం వివరాలను నింపి ఇవ్వాలి. దానిని వారు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తారు. MRO, MPDO, AOలతో కూడిన ‘మండల స్థాయి కమిటీ’ అర్జీలను పరిశీలించి జిల్లా అధికారులకు పంపుతుంది. వారి ఆమోదం తర్వాత, యంత్రాలిచ్చే కంపెనీ పేరిట రైతులు తమ వాటా సొమ్మును డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది.

News January 20, 2026

చిత్తూరు: మీ ఖాతాల్లో డబ్బులు పడ్డాయా?

image

జిల్లాలో పట్టు రైతులకు ప్రభుత్వం రూ.1.72 కోట్ల బకాయిలు విడుదల చేసింది. 973 మందికి సబ్సిడీ కింద రావాల్సిన రూ.1,64,83,589 ప్రభుత్వం వారి వ్యక్తి గత బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. దీంతో పాటు నాన్ ఫార్మింగ్ సెక్టార్ కింద పట్టుశాఖకు అనుసంధానంగా చేపట్టిన పనులకు గాను రూ.7,31,800 నిధులు పట్టు పరిశ్రమ ద్వారా వారి ఖాతాల్లో జమ చేశారు.