News February 16, 2025

ఖమ్మం జిల్లాలో BRS PINK బుక్ ఫీవర్

image

BRS నేతలపై కక్షపూరితంగా వ్యవహరించిన వారి పేర్లు పింక్ బుక్‌లో రాయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించిన విషయం విదితమే. అయితే గత 10 రోజుల కింద ఖమ్మం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఈ విషయమై తీవ్రంగా ధ్వజమెత్తారు. జిల్లాలో కార్యకర్తలపై అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని, వారి పేర్లు పింక్ డైరీలో రాస్తున్నామని, వారికి వడ్డీతో సహా చెల్లిస్తామనడం, ఇటీవల కవిత మాటలతో పింక్ బుక్ హాట్ టాపిక్‌ అయింది.

Similar News

News April 17, 2026

తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టిపై రాష్ట్రపతికి ఫిర్యాదు..!

image

ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. “పనులు చేస్తాం.. ప్రజలు తోచింది ఇస్తారు” అన్న వ్యాఖ్యలు లంచం తీసుకోవడాన్ని సమర్థించేలా ఉన్నాయంటూ ఒక వ్యక్తి నేరుగా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. బాధ్యత గల ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం నేరమని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశం ఇప్పుడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

News April 17, 2026

BREAKING: బిచ్కుంద ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై ఏసీబీ రైడ్స్

image

కామారెడ్డి జిల్లా బిచ్కుంద పట్టణ ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ ఇంటిపై శుక్రవారం ఏసీబీ అధికారులకు రైడ్స్ చేపట్టారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేస్తున్నారు. అద్దెకు ఉండే ఇంట్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 17, 2026

ఉమెన్ రిజర్వేషన్లకు డీలిమిటేషన్‌తో లింకెందుకు: థరూర్

image

మహిళా రిజర్వేషన్లను ఆలస్యం చేయకుండా LSలో ప్రస్తుత సభ్యుల సంఖ్యను అనుసరించి అమలు చేయాలని INC MP శశిథరూర్ డిమాండ్ చేశారు. ‘డీలిమిటేషన్ తరువాత రిజర్వేషన్లు అమలు చేస్తామంటున్నారు. ఈ రిజర్వేషన్లను డీలిమిటేషన్‌తో ఎందుకు ముడిపెడుతున్నారు. LS సభ్యుల సంఖ్యను 850కి పెంచడం ప్రపంచంలో గొప్పదంటున్నారు. గతంలో పార్లమెంటు సమావేశాలు ఏడాదికి 123 రోజులు జరిగితే ఇప్పుడు 60డేస్‌కు కుదించారు’ అని విమర్శించారు.