News April 13, 2025
ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది.!

ఖమ్మం జిల్లా చెట్టంత గొప్ప మనిషిని కోల్పోయింది. పర్యావరణ పరిరక్షణ కోసం పద్మశ్రీ వనజీవి రామయ్య చేసిన కృషి వెలకట్టలేనిది. దాదాపు కోటిన్నర మొక్కలు నాటారు రామయ్య-జానకమ్మ దంపతులు. ఆయన పర్యావరణ సేవలకు గాను 3వేల ప్రభుత్వ, ప్రైవేటు అవార్డులు వరించాయి. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా ప్రముఖులు విచారం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వనజీవి రామయ్యకు నివాళి అంటే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడమే.. ఏమంటారు?..
Similar News
News January 22, 2026
TU: ఐదు పరీక్ష కేంద్రాల్లో 2,729 మంది హాజరు

తెలంగాణ వర్సిటీ పరిధిలో B.Ed, B.P.Ed మొదటి, మూడో సెమిస్టర్, రెగ్యులర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య చంద్రశేఖర్ తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొత్తం 5 పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 2,798 మంది విద్యార్థులకు గాను 2,729 మంది విద్యార్థులు హాజరు కాగా 69 మంది గైర్హాజరయ్యారని ఆయన వెల్లడించారు. ఎటువంటి మాస్ కాపీయింగ్కు పాల్పడలేదన్నారు.
News January 22, 2026
తొలిసారిగా స్వయం జనగణనకు అవకాశం

TG: జనగణనలో తొలిసారిగా ప్రజలు స్వయంగా వివరాలు నమోదు చేసుకొనే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. ఇంటింటి సర్వే ఆరంభానికి 15 రోజుల ముందు వరకు ఇందుకు అవకాశమిచ్చింది. ఈమేరకు గెజిట్ జారీచేసింది. కాగా రాష్ట్రంలో 2026 APR1 నుంచి జన గణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. జనగణన SEP 30 వరకు జరుగుతుందని పేర్కొంది. సిబ్బంది ఇంటింటికీ వెళ్లి గృహ గణన చేపట్టనున్నారు.
News January 22, 2026
మెదక్: ‘ప్రశ్నిస్తున్నందుకే సిట్ ప్రేమ లేఖలు’

ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తనతో పాటు కేటీఆర్కు సిట్ నోటీసులు ఇస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వీటిని ఆయన రేవంత్ రెడ్డి సర్కార్ పంపిస్తున్న ‘ప్రేమ లేఖలు’గా అభివర్ణించారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా భయపడబోమని, ప్రజా సమస్యలపై గొంతు ఎత్తుతూనే ఉంటామని సీఎంకు సవాల్ విసిరారు. సమాధానం చెప్పలేకనే ప్రభుత్వం ఇలాంటి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు.


